Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ హడావుడిలో మెగా 'అత్తమ్మ కిచెన్'

ప్రస్తుతం పారిస్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచం మొత్తం పారిస్ ఒలింపిక్స్ వైపు ప్రత్యేక దృష్టి పెట్టాయి

By:  Tupaki Desk   |   30 July 2024 7:28 AM GMT
ఒలింపిక్స్ హడావుడిలో మెగా అత్తమ్మ కిచెన్
X

ప్రస్తుతం పారిస్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచం మొత్తం పారిస్ ఒలింపిక్స్ వైపు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఒలింపిక్స్ లో పథకాలు గెలవడం అనేది ప్రతి దేశానికి గర్వ కారణం అని చెప్పాలి. ఇండియన్ క్రీడాకారులు కూడా ఒలింపిక్స్ లో పథకాల కోసం వివిధ విభాగాలలో పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఒలింపిక్స్ క్రీడలు తిలకించేందుకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన కూడా పారిస్ వెళ్లారు.

వారితో పాటుగా క్లీంకారని ఒలింపిక్స్ క్రీడలు చూపించడానికి తీసుకెళ్ళారు. ఓ వైపు పారిస్ అందాలని ఆస్వాదిస్తూనే మెగా ఫ్యామిలీ అంతా ఒలిపింక్ క్రీడలు జరుగుతున్న స్పోర్ట్స్ విలేజ్ కి వెళ్లారు. అక్కడ పీవీ సింధు నేతృత్వంలో క్రీడలకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ స్పోర్ట్స్ స్టార్స్ తో మీట్ అయ్యారు. పీవీ సింధుతో రామ్ చరణ్, ఉపాసన దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అలాగే ఒలింపిక్ విలేజ్ లో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేస్తున్న పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో ఉపాసన షేర్ చేశారు. ఒలింపిక్ క్రీడాకారులు అందరిని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ విష్ చేశారు. ఈ సందర్భంగా అత్తమ్మ కిచెన్ పచ్చళ్ళని కూడా క్రీడాకారులకి పంపిణీ చేసినట్లు ఉపాసన కొణెదల ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఓ రెస్టారెంట్ లో పీవీ సింధు ఉన్న ఫోటోని అలాగే మెగాస్టార్ స్టార్ సతీమణి సురేఖ, అత్తమ్మ పచ్చళ్ళు బ్యాగ్ తో ఉన్న ఫోటోని ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఓ వైపు పారిస్ ఒలింపిక్స్ ని మెగా ఫ్యామిలీ అంతా ఆస్వాదిస్తూనే అత్తమ్మ కిచెన్ బ్రాండ్ ని ఉపాసన ప్రమోట్ చేసే పనిలో ఉందనే మాట వినిపిస్తోంది.

సురేఖ, ఉపాసన కలిపి ఈ అత్తమ్మ కిచెన్ ఫుడ్ బ్రాండ్ ని ప్రారంభించారు. ఇందులో సంప్రదాయ పచ్చళ్ళని తయారు చేసి వాటిని మార్కెట్ చేయబోతున్నారు. పారిస్ ఒలింపిక్స్ కేంద్రంగా చేసుకొని ఈ ఫుడ్ బ్రాండ్ ని ఉపాసన ప్రమోషన్ చేస్తూ ఉండటం విశేషం. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ క్రీడాకారులు అందరికి కూడా అత్తమ్మ కిచెన్ బ్రాండ్ పచ్చళ్ళు ప్యాకెట్స్ ని పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. పారిస్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. అలాగే రామ్ చరణ్ RC16 మూవీ షూటింగ్ కి సిద్ధం కానున్నారు.