Begin typing your search above and press return to search.

దీక్ష పూర్తిచేసిన చ‌ర‌ణ్‌..ముంబైలో మాల విస‌ర్జ‌న‌!

మెగాఫ్యామిలీలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఏటా అయ్య‌ప్ప మాల ధ‌రిస్తారు. తండ్రి చిరంజీవి నుంచి తొలుత ఈ దీక్ష తీసుకున్నారు

By:  Tupaki Desk   |   4 Oct 2023 6:25 AM GMT
దీక్ష పూర్తిచేసిన చ‌ర‌ణ్‌..ముంబైలో మాల విస‌ర్జ‌న‌!
X

మెగాఫ్యామిలీలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఏటా అయ్య‌ప్ప మాల ధ‌రిస్తారు. తండ్రి చిరంజీవి నుంచి తొలుత ఈ దీక్ష తీసుకున్నారు. గ‌తంలో చిరంజీవి కూడా ఏటా ధ‌రించేవారు. అయితే ఇప్పుడాయ‌నంత విదిగా దీక్ష తీసుకోవ‌డం లేదు. తండ్రి స్థానంలో చ‌ర‌ణ్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. చ‌ర‌ణ్ వీలైన‌ప్పుడ‌ల్లా అయ్య‌ప్ప మాల వేస్తారు. ఇప్ప‌టికే ఆయ‌న చాలాసార్లు మాల ధ‌రించారు.

గురుస్వామిగానూ ప్ర‌మోట్ అయ్యారు. ఇప్పుడాయ‌న స‌మ‌క్షంలో కూడా దీక్ష తీసుకోవాలి అనుకున్న వారు తీసుకొవ‌చ్చు. తాజాగా ఈ ఏడాది కూడా మాల ధ‌రించిన సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా కార్తీక‌మాసం ప్రారంభ రోజుల్లో ధ‌రించి..ముగింపుకు వ‌చ్చేస‌రికి మాల విస‌ర్జ‌న చేస్తారు. అదే నిబంధ‌న అని కాదు. చాలా మంది ఆ మాసంలోనే దీక్ష‌లో ఉంటారు. అయితే చ‌ర‌ణ్ మాత్రం త‌న వెసులు బాటుని బట్టి ఏటా మాల ధ‌రిస్తుంటారు. తాజాగా ఈ ఏడాది కూడా మాల వేయ‌డం...తాజాగా దీక్ష పూర్తిచేసి మాల విస‌ర్జ‌న కూడా చేసిన‌ట్లు తెలుస్తోంది.

చరణ్ ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయంలో అయ్యప్ప దీక్షను పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. సిద్ది వినాయ‌క ఆల‌యంలో ఇడుముళ్లు కార్య‌క్ర‌మం ముగించారు. తాజాగా ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్న ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దీంతో చ‌ర‌ణ్ తాను అనుకున్న రోజులు దీక్ష పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే చ‌ర‌ణ్ ఎన్ని రోజులు దీక్ష తీసుకున్నారు? అన్న‌ది క్లారిటీ లేదు.

ఇదే ఏడాది చ‌ర‌ణ్ ఇల్లు సంతోషాల‌కు నెల‌వైన సంగ‌తి తెలిసిందే. ఉపాస‌న -చ‌ర‌ణ్ జీవితాల్లోకి కొత్త‌గా క్లీంకార వ‌చ్చింది. ఇటీవ‌లే క్లీంకారని గ్రాండ్ గా సొంతింటికి చ‌ర‌ణ్- త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఆహ్వానించారు. ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్ మాల‌లోనే ఉన్నారు. తాజాగా మాల విస‌ర్జ‌న చేసిన నేప‌థ్యంలో తిరిగి మ‌ళ్లీ 'గేమ్ ఛేంజ‌ర్' షూటింగ్ లో బిజీ అవుతార‌ని తెలుస్తోంది. ఈనెల రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభిస్తార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే బాగా డిలే అయిన నేప‌థ్యంలో వీలైనంత వేగంగా చుట్టేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.