Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిని టార్గెట్ చేసిన బాల‌య్య-బోయ‌పాటి!

నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అవ్వ‌డంతో మ‌ళ్లీ అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు పున ప్రారంభ మయ్యాయి

By:  Tupaki Desk   |   16 Jun 2024 6:24 AM GMT
అమ‌రావ‌తిని టార్గెట్ చేసిన బాల‌య్య-బోయ‌పాటి!
X

నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అవ్వ‌డంతో మ‌ళ్లీ అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు పున ప్రారంభ మయ్యాయి. రెండున్న‌రేళ్లోనే రాజ‌ధాని పూర్తి చేస్తామ‌ని మంత్రి నారాయ‌ణ కూడా ధీమా వ్య‌క్తం చేసారు. అందుకు సంబంధించిన ప‌నులు డే వ‌న్ నుంచే మొద‌లైన‌ట్లు తెలిపారు. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం కూడా అమ‌రావ‌తిలోనే జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన రాజ‌కీయా నాయ‌కుల సంగ‌తి ప‌క్క‌న బెడితే మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించే స‌రికి అక్క‌డ వాతావ‌ర‌ణ‌మే మారిపోయింది.

అంద‌రిలో ఒక్క‌సారిగా జోష్ నిండింది. అన్న‌ద‌మ్ములిద్ద‌ర్నీ అలా చూసి అభిమానుల పూన‌కానికి అడ్డు అదుపు లేదు. అదే సినిమా వాళ్ల గొప్ప‌త‌నం అని మ‌రోసారు రుజువైంది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ప్రాంత‌మంతా ఒక్క‌సారిగా మార్మోగింది. తాజాగా అమ‌రావ‌తిపై బాల‌య్య‌-బోయ‌పాటి ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో నాల్గ‌వ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాల‌య్య చిన్న కుమార్తె తేజ‌శ్వినీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆమె నిర్మాత‌గా ప‌రిచయం అవుతున్నారు.

ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇది అఖండ‌-2 నా? లేక కొత్త కాన్సెప్ట్ తో వ‌స్తున్నారా? అన్న‌ది క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా సింహ భాగం షూటింగ్ మాత్రం అమ‌రావ‌తిలో నిర్వ‌హించాల‌ని బాల‌య్య‌-బోయ‌పాటి బ‌లంగా నిర్ణ‌యించుకున్నారుట‌. అవ‌స‌ర‌మైతే అక్క‌డే ప్ర‌త్యేకంగా సెట్లు నిర్మించి హైద‌రాబాద్ నుంచి దింపాల్సిన అంద‌ర్ని దింపి అక్క‌డే షూట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

ఖ‌ర్చు విష‌యంలో ఏమాత్రం త‌గ్గేది లేద‌ని...ఎన్ని కోట్లు అయినా ఖ‌ర్చు చేయ‌డానికి తేజ‌శ్వినీ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసారుట‌. త‌మ సినిమాతో మరుగున ప‌డిన అమ‌రావ‌తి అంద‌రికీ తెలియాల‌ని, షూటింగ్ ఎక్క‌డ చేసారంటే? అమ‌రావ‌తి అని గొప్పుగా చెప్పుకునేలా ఉండాల‌ని బోయ‌పాటి అండ్ కో ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి సంబంధించిన ప్లానింగ్ కూడా బోయ‌పాటి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.