Begin typing your search above and press return to search.

బెల్లంకొండ కొత్త మూవీ.. బాబు మళ్ళీ స్పీడ్ పెంచాడు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కొన్ని నెలలుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   23 July 2024 1:56 PM GMT
బెల్లంకొండ కొత్త మూవీ.. బాబు మళ్ళీ స్పీడ్ పెంచాడు
X

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కొన్ని నెలలుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌ లో పెడుతున్నారు. ఎలా అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. టైసన్ నాయుడు మూవీని పూర్తి చేస్తున్న సాయి శ్రీనివాస్.. ఇటీవల కౌశిక్‌ పెగళ్లపాటి ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమా స్టార్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా సాయి శ్రీనివాస్ మరో కొత్త మూవీ (BSS 12) అనౌన్స్మెంట్ వచ్చేసింది. లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ 75వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. కొత్త డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. మూవీని ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోస్టర్ లో హీరో పురాతన ఆలయం ముందు నిలబడి దీర్ఘంగా చూస్తున్నారు. టెంపుల్ పై సూర్యకిరణాలు పడడంతో పోస్టర్ అంతా డివోషనల్ వైబ్ తో ఆకట్టుకుంటోంది. సాయి శ్రీనివాస్ తుపాకీ పట్టుకుని గుడి వైపు చూస్తూ రాళ్లపై నిలుచున్నారు. 400 ఏళ్ల నాటి గుడి నేపథ్యంతో సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ మూవీలో సాయి శ్రీనివాస్ ను ఇప్పటి వరకు ఎవరూ చూడని అవతార్‌ లో మేకర్స్ చూపించనున్నారట.

కమర్షియల్ అంశాలతో కూడిన ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ ను సినిమా కోసం దర్శకుడు లుధీర్ బైరెడ్డి సిద్ధం చేశారు. భారీ బడ్జెట్ తోపాటు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు మేకర్స్. సాయి శ్రీనివాస్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా శివన్ రామకృష్ణ సమర్పిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఒక షెడ్యూల్ పూర్తి కూడా అయింది. బుధవారం నుంచి రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

ఈ సినిమాకు గాను.. ప్రముఖ టెక్నీషియన్లను రంగంలోకి దించారు మేకర్స్. శివేంద్ర కెమరామ్యాన్‌ గా వ్యవహరిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్ గా, శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఫస్ట్ పోస్టర్ తో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.