Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్' గురించి మాట్లాడుతూనే ఉండండి! -భూష‌ణ్ కుమార్

ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 May 2024 12:22 PM GMT
యానిమ‌ల్ గురించి మాట్లాడుతూనే ఉండండి! -భూష‌ణ్ కుమార్
X

ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన చ‌ర్చ‌ విపరీతమైన ప్రకంపనలు సృష్టించింది. ఈ చిత్రం ఇతివృత్తం, సమస్యాత్మక సన్నివేశాలు.. సందీప్ రెడ్డి వంగా స్టేట్ మెంట్స్ కారణంగా నిరంత‌రం ముఖ్యాంశాలలో నిలిచింది. ఇటీవలి ఇంటర్వ్యూలో నిర్మాత భూషణ్ కుమార్ యానిమ‌ల్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

భూషణ్ కుమార్ మాట్లాడుతూ ''యానిమ‌ల్ గురించి చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా సినిమా గురించి ఎవరో ఒకరు మాట్లాడుకోవడం చూస్తున్నాను. ప్రజలు యానిమ‌ల్‌ గురించి మాట్లాడటం లేదా జోకులు వేయడం ప్రారంభించిన క్షణంలో అది నెట్‌ఫ్లిక్స్‌లో తిరిగి టాప్ 10 జాబితాలోకి వస్తుంది. జోకులు అన్ని విషయాలతో నేను పూర్తిగా ఓకే. నా దర్శకుడు సినిమా చుట్టూ జరుగుతున్న చర్చలతో సంతోషంగా లేడు. అతడు చాలా మందికి చాలా ఎక్కువ సమాధానాలు చెప్పాడు. పెద్దగా ఇబ్బంది ప‌డొద్దని నేను అతడికి చెబుతూనే ఉన్నాను .అన్ని చర్చలు వాస్తవానికి మాకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి'' అని అన్నారు.

యానిమల్ 900 కోట్లు వసూలు చేసింది. ఇది కల్ట్ హిట్.. ప్రజలు 'యానిమల్ పార్క్' (సీక్వెల్) చూడటానికి ఎదురు చూస్తున్నారు. అందువల్ల ఎవ‌రైనా యానిమ‌ల్ గురించి మాట్లాడాలని నిర్ణయించుకుంటే వారిని అలా చేయనివ్వండి. ఇది మాకు ఇబ్బంది కలిగించదు... అని భూష‌ణ్‌ అన్నారు. ప్రభాస్ తో సందీప్ వంగా 'స్పిరిట్ చిత్రీక‌ర‌ణ‌ పూర్తయ్యాక యానిమల్ పార్క్ ప్రారంభం కానుంది.