Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : కింగ్ నాగ్ ఈజ్ ఆన్ ఛార్జ్.. ఒక్కొక్కరి గుడ్లు పగిలిపోయాయి..!

ఈ వారం జరిగిన గుడ్ల టాస్క్ గురించి నాగార్జున హౌస్ మెట్స్ అందరితో మాట్లాడాడు. ముఖ్యంగా అభయ్ నవీన్ పై హోస్ట్ నాగార్జున తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   22 Sep 2024 3:45 AM GMT
బిగ్ బాస్ 8 : కింగ్ నాగ్ ఈజ్ ఆన్ ఛార్జ్.. ఒక్కొక్కరి గుడ్లు పగిలిపోయాయి..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో శనివారం ఎపిసోడ్ వచ్చింది అంటే కింగ్ నాగార్జున ఎలా హౌస్ మెట్స్ మీద ఫైర్ అవుతారని ఆసక్తిగా ఎదురుచూస్తారు. వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆడిన ఆటకు వీకెండ్ లో హోస్ట్ నాగార్జున ఇచ్చే రివ్యూ అదిరిపోతుంది. ఇక హౌస్ లో ఎవరు కాస్త అతి చేసినా ఎవరు ఆటలో ఫౌల్ ఆడినా ఇలా అన్ని అంశాలను ప్రస్తావిస్తూ నాగార్జున అడుగుతారు కడుగుతారు.

ఈ వారం జరిగిన గుడ్ల టాస్క్ గురించి నాగార్జున హౌస్ మెట్స్ అందరితో మాట్లాడాడు. ముఖ్యంగా అభయ్ నవీన్ పై హోస్ట్ నాగార్జున తన అసహనాన్ని వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ బిగ్ బాస్ మీద ఎటాక్ చేసిన అభయ్ కు తను మాట్లాడిన మాటలన్నీ చూపించి మరీ రెడ్ కార్డ్ చూపించి తక్షణమే హౌస్ లో నుంచి బయటకు వెళ్లాలని నాగార్జున అన్నాడు. ఐతే మిగతా హౌస్ మెట్స్ తో పాటు అభయ్ కూడా ఇలాంటిది మరోసారి రిపీట్ అవ్వదని చెప్పడంతో ఫైనల్ గా క్షమించారు.

అంతేకాదు ప్రేరణ, విష్ణు ప్రియ మధ్య జరిగిన గొడవని కూడా మణికంఠ హైలెట్ చేశాడని అతన్ని కన్ ఫెషన్ రూం లోకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. యష్మిని మణికంఠ హగ్ చేసుకోవడం గురించి ఆమె బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేయగా దాని గురించి నాగార్జున మణికంఠను మందలించాడు. ఇక ప్రేరణ, విష్ణు ప్రియల మధ్య జరిగిన దోశ వీడియో చూపించి వారి డౌట్లు క్లారిఫై చేశారు.

ఇక వీక్ మొత్తం ఆడిన గుడ్ల టాస్క్ ను పోల్చుతూ ఎవరు బాగా ఆడారో వారి గుడ్డుని పగలగొట్టకుండా బాగా ఆడని వారి గుడ్డుని పగలగొట్టారు. నిఖిల్ తప్ప అందరి గుడ్లను నాగార్జున పగలగొట్టారు. ఐతే ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉండగా ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. బిగ్ బాస్ లీక్స్ ప్రకారం అభయ్ నవీన్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్టు సమాచారం. ఈ వారం జరిగిన గుడ్ల టాస్క్ వల్ల హౌస్ మెట్స్ మధ్య చాలా వాదనలు జరిగాయి కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కు తప్పకుండా ఈ రీజన్స్ నే ప్రధానంగా తీసుకుంటారని చెప్పొచ్చు.