Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ.. కుక్కర్ దగ్గర మొదలైన రచ్చ..!

ఎంట్రీ టైం లో టాస్కులు గెలిచిన వారికి టాస్క్ పెట్టి ముగ్గురు చీఫ్స్ గా ఎంపిక చేసిన బిగ్ బాస్.

By:  Tupaki Desk   |   4 Sep 2024 4:57 AM GMT
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ.. కుక్కర్ దగ్గర మొదలైన రచ్చ..!
X

బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం మొదలైందో లేదో సోమవారం నామినేషన్స్ రచ్చ మొదలైంది. అన్ని సీజన్లలో మొదటి వారం నామినేషన్స్ ఏదో వెయ్యాలి కదా అన్నట్టు వేసేవారు. కానీ ఈ సీజన్ 8 లో మాత్రం మొదటి వారమే రచ్చ షురూ చేశారు. ఎంట్రీ టైం లో టాస్కులు గెలిచిన వారికి టాస్క్ పెట్టి ముగ్గురు చీఫ్స్ గా ఎంపిక చేసిన బిగ్ బాస్. ఈసారి కెప్టెన్స్ బదులుగా చీఫ్స్ అంటూ కొత్త రూల్ తీసుకొచ్చాడు. ఐతే ప్రతి సీజన్ లో సోమవారమే నామినేషన్స్ జరుగుతాయి. కానీ ఈ సీజన్ మంగళవారం నాడు నామినేషన్స్ మొదలు పెట్టారు.

అంతేకాదు ఇంకా నామినేషన్స్ అందరి ఇంటి సభ్యులవి పూర్తి కాలేదు. నేడు అంటే బుధవారం ఎపిసోడ్ తో పూర్తి నామినేషన్స్ అవుతాయి. బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. సీజన్ 8 లో ఎవరికి వారు తగ్గేదేలేదు అన్నట్టుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా బేబక్క వంట విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారని సోనియా నామినేషన్స్ వేసింది. కుక్కర్ ఉడికినా ఆమె చెక్ చేయకుండా అలానే ఉందని ఇతరుల ఆకలి ఆమెకు అంత బాధ్యత లేదని కుక్కర్ విషయంలో జరిగిన పంచాయితీని నామినేషన్స్ లో పెట్టి ఆమెను నామినేట్ చేయడానికి కారణం చెప్పింది సోనియా.

ముగ్గురు చీఫ్ లు ఈసారి నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వగా మిగతా 11 మంది కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేస్తూ వారి ఫోటోలను ఒక చోట్ల అంటించాల్సి ఉంటుంది. ఎందుకు ఆ ఇద్దరు అన్నది వారి కారణాలు విన్న తర్వాత చీఫ్ లో ముగ్గురు కత్తి తీసుకుని నామినేట్ చేసే వారి ఫోటోకి గుచ్చాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు నాగ మణికంథ, బేబక్క, శేఖర్ బాషా, పృధ్విరాజ్ నామినేట్ అయ్యారు. అంతేకాదు విష్ణు ప్రియ, సోనియా కూడా నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్ విషయంలో మొదటి వారం నుంచే కంటెస్టెంట్స్ ఎటాకింగ్ మొదలు పెట్టారు. సీజన్లు అన్ని చూసొచ్చారు కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఏడో గొడా లేవనెత్తి హడావిడి చేయాలని చూస్తున్నారు. ఐతే ఇది కొన్నిసార్లు మంచిదేమో కానీ చూసే ఆడియన్స్ కి మాత్రం విసుగు తెప్పిస్తుంది. నిఖిల్, యష్మి, నైనిక చీఫ్స్ ఉన్నారు. ఐతే ఆర్గ్యుమెంట్ టైం లో నిఖిల్, కిరాక్ సీత మధ్య పెద్ద గొడవ అయ్యింది. వేరొకరి నామినేషన్ టైం లో మిగతా హౌస్ మెట్స్ మాట్లాడొద్దు అన్న దాని మీద నిఖిల్, కిరాక్ సీత మధ్య మాటల యుద్ధం జరిగింది. మొత్తానికి సీజన్ 8 ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంది.