Begin typing your search above and press return to search.

చెన్నైపై బాలీవుడ్ బ్యూటీ ప్రేమ..!

మెర్రీ క్రిస్మస్ అనే టైటిల్‌ తో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు కత్రీనా కైఫ్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 2:30 AM GMT
చెన్నైపై బాలీవుడ్ బ్యూటీ ప్రేమ..!
X

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్ సౌత్‌ లో కెరీర్‌ ఆరంభం సమయంలో సినిమాలు చేసింది. కానీ హిందీ సినిమాలతో బిజీ అవ్వడం వల్ల మళ్లీ సౌత్ సినిమాల వైపు చూడలేదు. చాలా కాలం తర్వాత తమిళంలో ఈ అమ్మడు సినిమా చేసింది. ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మెర్రీ క్రిస్మస్ అనే టైటిల్‌ తో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు కత్రీనా కైఫ్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరిద్దరి జోడీ లో సినిమా అంటూ ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సినిమా పై అంచనాలు, ఆసక్తి పెరుగుతూనే వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. కత్రీనా కైఫ్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి వచ్చింది. ఆ సందర్భంగా తనకు చెన్నై మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది. తనకు చెన్నై అంటే చాలా ఇష్టం అని, తన తల్లి తమిళనాడు మధురై లో ఒక్క స్కూల్‌ లో టీచర్ గా చేసిందని కత్రీనా చెప్పుకొచ్చింది.

తమిళనాడు తో తనకు చాలా కాలంగా మంచి సన్నిహిత సంబంధం ఉందని పేర్కొంది. ఆ సంబంధంతోనే ఈ సినిమా ను చేసేందుకు ఆసక్తి చూపించినట్లు పేర్కొంది. ముందు ముందు సౌత్‌ లో మరిన్ని సినిమాలు చేస్తాను అంటూ ఈ అమ్మడు పేర్కొంది. కత్రీనా కైఫ్‌ సోషల్‌ మీడియా ద్వారా కూడా ఈ సినిమా ను తెగ ప్రమోట్‌ చేస్తోంది.

విజయ్ సేతుపతితో కలిసి మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటించడం ద్వారా సౌత్‌ లో గ్రాండ్ గా ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇవ్వనుంది. సౌత్‌ లోనే కాకుండా ఈ సినిమా ను హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.