Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న క్రేజీ బ్రదర్స్!

అయితే అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   29 July 2024 10:18 AM GMT
ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న క్రేజీ బ్రదర్స్!
X

కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ లోనూ తమకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. కొన్నిసార్లు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ వసూళ్ళు రాబట్టారంటేనే, మన దగ్గర వాళ్లకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కార్తీ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయగా.. సూర్య ఎప్పటి నుంచో ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువా’. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇదొక ఫాంటసీ యాక్షన్‌ మూవీ. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కార్తీ కూడా కనిపించబోతున్నారనే ఆసక్తికర విషయాన్ని తమిళ లిరిక్‌ రైటర్‌ వివేక్ బయటపెట్టారు.

‘ఫైర్‌ సాంగ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా గీత రచయిత వివేక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'కంగువ సినిమాలో కార్తి నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి? అందులో నిజమెంత?' అని అడగ్గా.. డైరెక్టర్ చెప్పకుండా ఈ విషయాన్ని ఎలా రివీల్‌ చెయ్యాలో తెలియదంటూనే, అన్నదమ్ముల కాంబినేషన్ లో సీన్స్‌ ఉంటాయని తెలిపారు. ఇటీవల నిర్మాత కేఈ జ్ఞాన్ వేల్ రాజా సైతం ఈ చిత్రంలో కార్తీ కనిపించబోతున్నారని పరోక్షంగా హింట్ ఇచ్చారు.

గతంలో కార్తీ హీరోగా తెరకెక్కిన 'కడైకుట్టి సింగం' (తెలుగులో 'చినబాబు') సినిమాలో సూర్య స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. కానీ ఇద్దరి కాంబోలో సీన్స్ లేవు. 'బ్రదర్స్' మూవీలో సూర్య అవిభక్త కవలలుగా ద్విపాత్రాభినయం చేయగా.. తెలుగులో ఒక పాత్రకు కార్తీ డబ్బింగ్ చెప్పారు. ఇన్నాళ్లకు ఇప్పుడు "కంగువ" సినిమాలో సూర్య - కార్తీ కలిసి నటిస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. స్క్రీన్ స్పేస్ ఎంత ఉన్నా సరే, అన్నదమ్ములిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడటం నిజంగా ఫీస్ట్ లా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

'కంగువ' సినిమాలో సూర్య మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని టాక్. ఇప్పటికే రిలీజైన రెండు లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో త్రీడీ, ఐమాక్స్ ఫార్మాట్ లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజువల్స్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. దసరా పండుగ కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల సూర్య బర్త్ డే స్పెషల్ గా ‘ఫైర్‌ సాంగ్‌’ ను రిలీజ్ చేశారు.