Begin typing your search above and press return to search.

హర్ష సాయి కేసు.. పోలీసుల అదుపులో బిగ్ బాస్ కంటెస్టెంట్?

ఈ వ్యవహారంలో మూడు గంటలపాటు నేడు సైబర్ క్రైమ్ ఆఫీస్ లో శేఖర్ బాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 4:58 PM GMT
హర్ష సాయి కేసు.. పోలీసుల అదుపులో బిగ్ బాస్ కంటెస్టెంట్?
X

యూట్యూబర్‌ హర్షసాయిపై కొన్నిరోజుల క్రితం అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను రే*ప్ చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్‌ మెయిల్‌ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిగ్ బాస్-8 కంటెస్టెంట్, ఆర్ జే శేఖ‌ర్ బాషాను తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ ఛానల్స్‌ లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో మూడు గంటలపాటు నేడు సైబర్ క్రైమ్ ఆఫీస్ లో శేఖర్ బాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలోనే అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ జే బాషాతో పాటు మరికొందరు ఇన్ఫ్లూయెన్స‌ర్స్ పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది.

అయితే ఆర్ జే శేఖర్ బాషా.. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్-8 హౌస్ లోకి అడుగుపెట్టి.. కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేశారు. ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్ చేశారు బాషా. ఆ తర్వాత మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 18 ఐఆర్ఎఫ్‌ అవార్డులు అందుకున్నారు. అనేక సార్లు యాక్టివిస్ట్ గా మారుతానని తాను అనుకోలేదని అన్నారు. పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే ఛాన్స్ దక్కించుకున్నారు. బిగ్‌ బాస్‌ కు రావడం తన కలగా స్టేజీపై నాగ్ తెలిపారు. అందుకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. హౌస్ లో అసలు సిసలైన శేఖర్‌ బాషాను చూడబోతున్నారంటూ తెలిపారు. హౌస్‌ లో తనను ఫ్రెండ్ గా చూస్తే పర్వాలేదని, లేకుంటే బిగ్‌ బాస్‌ టైటిల్‌ పట్టుకుపోతానని అన్నారు. బిగ్ బాస్ లోనూ తన స్పందనను చెబుతా అన్నారు. కానీ అనూహ్యంగా రెండో వారానికి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.