Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ సహనం కోల్పోయాడా?

ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ అయితే అసలు హ్యాపీగా లేరు. దిల్ రాజు ఎక్కడ కనిపించినా కూడా గేమ్ ఛేంజర్ కు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలి అని చాలా ఒత్తిడి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 1:30 AM GMT
రామ్ చరణ్ సహనం కోల్పోయాడా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యం అవుతున్న విధానం అందరికీ చిరాకును కలిగిస్తోంది. శంకర్ మీద గౌరవంతో ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలి అని అనుకున్న దిల్ రాజుకు బడ్జెట్ పెరగడం తప్ప ఇప్పటివరకు సినిమాపై సరైన బజ్ కూడా పెరగలేదు. ఒకవైపు దిల్ రాజు మరొకవైపు శంకర్ ఈ ఇద్దరు మీద నమ్మకంతోనే రామ్ చరణ్ ఒక విధంగా వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

శంకర్ జడ్జిమెంట్ మీద నమ్మకంతో పాటు దిల్ రాజుతో ఉన్న అనుబంధం తో రాంచరణ్ డేట్స్ విషయంలో కూడా పెద్దగా అడ్డు చెప్పలేదు. టెక్నికల్ గా అభ్యంతరాలతో షూటింగ్ ఆలస్యం అవుతుంది అంటే ఏమైనా అనుకోవచ్చు.. కానీ శంకర్ గేమ్ ఛేంజర్ కంటే ఎక్కువగా ఇండియన్ 2 సినిమాపై ఫోకస్ చేస్తున్నారు అనే అభిప్రాయాలు వస్తున్నాయి.

ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ అయితే అసలు హ్యాపీగా లేరు. దిల్ రాజు ఎక్కడ కనిపించినా కూడా గేమ్ ఛేంజర్ కు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలి అని చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఇక దిల్ రాజు కూడా ఎన్నో రోజులు ఓపిక పట్టడు. అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ మాత్రం శంకర్ తో పాటు దిల్ రాజుకి మరొక డెడ్ లైన్ వీధించినట్లుగా కూడా తెలుస్తుంది.

ఆఖరి మాటగా ఈ సినిమా ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఫినిష్ చేసుకోవాలని చెప్పినట్లు టాక్ వస్తోంది. ఎందుకంటే రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా గేమ్ ఛేంజర్ వల్లే ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే బుచ్చి రామ్ చరణ్ కోసం చాలా సమయం ఎదురు చూశాడు.

అయితే శంకర్ ఇండియన్ 2 పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసుకుని గేమ్ ఛేంజర్ పనులను కూడా ముగించాల్సిన అవసరం ఉంది. మరి శంకర్, రామ్ చరణ్ చెప్పిన ఆఖరి మాటకు తగ్గట్టుగా సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తాడో లేదో చూడాలి. ఇక బుచ్చిబాబు సినిమాను చరణ్ 2024 మార్చిలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.