Begin typing your search above and press return to search.

చైతూ ఆ విషయం పై ఫోకస్ పెట్టాడా..?

ప్రముఖ ఆదిశక్తి థియేటర్ పేరు వినే ఉంటారు. అక్కడ కు చాలా మంది నట లో మెళకువలు నేర్చుకోవడానికి వెళుతూ ఉంటారు. అయితే.

By:  Tupaki Desk   |   2 Aug 2023 10:12 AM GMT
చైతూ ఆ విషయం పై ఫోకస్ పెట్టాడా..?
X

అక్కినేని వారసుడు నాగ చైతన్య కి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల ని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు. ప్రస్తుతం చైతూ గతం లో తనతో ప్రేమమ్, సవ్యసాచి వంటి చిత్రాల ను రూపొందించిన కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో జతకడుతున్నారు.

అయితే, ఈ మూవీ షూటింగ్ మొదలవ్వడానికి కొంత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే చందూ మొండేటి ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే, అప్పటి వరకు సమయం ఎందుకు వృథా చేయాలి అని అనుకున్నాడేమో చైతూ, తన కెరీర్ కి పనికి వచ్చే పని పై ఫోకస్ పెట్టాడు.

చైతూ నటన కు వంక పెట్టాల్సిన అవసరం లేదు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, సినిమా సినిమాకీ తన నటన ను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అయితే, నటన పరంగా మరింత మెరుగవ్వాలి అనుకున్నాడేమో ఈ గ్యాప్ లో చైతూ ఓ థియేటర్ కి వెళ్లాడు. ప్రముఖ ఆదిశక్తి థియేటర్ పేరు వినే ఉంటారు. అక్కడ కు చాలా మంది నట లో మెళకువలు నేర్చుకోవడానికి వెళుతూ ఉంటారు. అయితే.,చైతూ కూడా అక్కడకు వెళ్లడం విశేషం. అక్కడ కొందరితో కలిసి శిక్షణ పొందినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ విషయాన్ని చైతూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆ థియేటర్ లోని అందమైన ఫోటోల ను, అలాగే తాను అక్కడ కలుసుకున్న కొందరి వ్యక్తులతో దిగిన ఫోటోల ను ఆయన షేర్ చేశారు. అలాగే, అక్కడ గడిపిన సమయం లో తాను కలిసుకున్న అద్భుతమైన వ్యక్తలను ట్యాగ్ చేసి, వారితో జర్నీ ఎంత అద్భుతంగా సాగిందో చైతూ పేర్కొన్నారు. అక్కడి వ్యక్తులు, ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, చైతూ చివరగా కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీలో చైతూ కానిస్టేబుల్ గా కనిపించాడు. ఆయన సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కనీస వసూళ్లు కూడా రాబట్టకపోవడం గమనార్హం.