Begin typing your search above and press return to search.

నిర్మాత రాధాకృష్ణ గారికి మాతృ వియోగం

దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.

By:  Tupaki Desk   |   30 May 2024 1:11 PM GMT
నిర్మాత రాధాకృష్ణ గారికి మాతృ వియోగం
X

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్లో ఒకరైన సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) గారి మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) కన్నుమూశారు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె గురువారం 3 గంటల ప్రాంతంలో స్వర్గస్థులయ్యారు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.


ఆవిడకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇక నిర్మాత రాధాకృష్ణ గారు ఆవిడకు రెండవ కుమారుడు. యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తండ్రి పెద్ద కుమారుడు. నాగ వంశీకి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

నిర్మాతగా చిన్నబాబు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును అందుకున్నారు. మొదటి డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన ఆయన ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తో ఎంతో సన్నిహిత్యం ఉండడంతో ఎక్కువగా వారితోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక హారిక హాసిని ప్రొడక్షన్లో సన్నాఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, అల..వైకుంఠపురములో.., గుంటూరు కారం లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలను నిర్మించారు.

త్రివిక్రమ్ వారికి మంచి స్నేహితులు. ఇక వారి సపోర్ట్ తోనే చిన్న చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇక నిర్మాత నాగ వంశీ కూడా ఆ సంస్థ ద్వారానే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అనుబంధ సంస్థగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సితార ఫార్చూన్ ఫర్ లో నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.