Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మరో ఖరీదైన నిర్ణయం

ఇదే సమయంలో, చిరు కుటుంబానికి కూడా విశ్రాంతి మరియు సెలవులు గడపడానికి ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

By:  Tupaki Desk   |   5 Oct 2024 9:56 AM GMT
మెగాస్టార్ మరో ఖరీదైన నిర్ణయం
X

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక స్టార్ మాత్రమే కాదు, ఆర్థిక క్రమశిక్షణతో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన గొప్ప వ్యాపారవేత్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భూముల్లో పెట్టుబడులు పెట్టడంలో చిరు చాలా తెలివిగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాపర్టీలను చిరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి ఒక ప్రముఖ ప్రదేశంలో విలాసవంతమైన ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు సమాచారం.

అది మరెక్కడో కాదు.. ఇండియాలో బెస్ట్ టూరింగ్ స్పాట్స్ లో ఒకటైన ఊటీ. ఊటీ శివార్లలో ఉన్న ఈ భూమి అందమైన పర్వత దృశ్యాలతో పాటు, చుట్టూ ఉన్న టీ తోటలతో ఆకట్టుకునే లొకేషన్‌లో ఉంది. ఈ విలాసవంతమైన స్థలాన్ని మెగాస్టార్ రూ. 16.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ ప్రాపర్టీ మొత్తం 5.5 ఎకరాలుగా ఉండదమే కాకుండా, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేందుకు చక్కని లొకేషన్‌గా ఉందట.

ఊటీ ప్రాంతం తూర్పు ప్రాంతాల్లో చాలా మంది ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు విలాసవంతమైన ప్రాపర్టీలు కొనుగోలు చేస్తున్నారు. ఆ కోవలోనే మెగాస్టార్ కూడా సొంత ఇల్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన కూడా ఈ ప్రాపర్టీని ఇటీవల సందర్శించారు.

చిరంజీవి కుటుంబం త్వరలో ఈ భూమిలో ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ నిర్మించాలని యోచిస్తోంది. ఇప్పటికే అవసరమైన అనుమతులను పొందినట్లు సమాచారం. ఫామ్ హౌస్ నిర్మాణం పూర్తయిన తర్వాత, చిరంజీవి కుటుంబం ఊటీ కి తరచూ వస్తుండొచ్చని సమాచారం. ఈ ప్రాంతం చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు దగ్గరగా ఉండడం, ప్రకృతి అందాలతో నిండి ఉండటం వలన చిరంజీవి ఈ ప్రాపర్టీకి పెట్టుబడి పెట్టారని సమాచారం.

ఇదే సమయంలో, చిరు కుటుంబానికి కూడా విశ్రాంతి మరియు సెలవులు గడపడానికి ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఇక ఈ సినిమా 2025 క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో చిరంజీవి పలు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నారు, దాంతో పాటు ఈ సినిమా హై లెవెల్లో విజువల్ ట్రీట్ గా నిర్మాణం జరుపుకుంటుందని చిత్రబృందం వెల్లడించింది. అలాగే మెగస్టార్ మరికొన్ని కథలు కూడా వింటున్నారు. వాటిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.