Begin typing your search above and press return to search.

చికెన్ గున్యా నుంచి చిరంజీవి పూర్తిగా కోలుకోలేదా ?

మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 6:16 AM GMT
చికెన్ గున్యా నుంచి చిరంజీవి పూర్తిగా కోలుకోలేదా ?
X

మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 156 సినిమాల్లో మొత్తం 537 పాటల్లో 24 వేల డాన్స్ స్టెప్స్‌ వేసినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు. ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ ను బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న మెగాస్టార్‌ చిరంజీవి గత 25 రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆయన చికెన్‌ గున్యా తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడ్డా ఇంకా పూర్తిగా రికవరీ కాలేదని సమాచారం అందుతోంది.

ఆదివారం హైదరాబాద్‌ లో జరిగిన ఈవెంట్‌ లో చిరంజీవి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చిరంజీవి ఫేస్ నీరసించినట్లు కనిపించింది. అంతే కాకుండా ఆయన వీక్ గా కూడా కనిపించారు. పీక్క పోయిన మొహంతో పాటు, ఉత్సాహం లేని చిరంజీవిని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. చిరంజీవి ని ఇలా చూడటం ఏమాత్రం బాగాలేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చిరంజీవి ఫోటోలు షేర్‌ చేసి మెగా ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి పూర్తిగా కోలుకుని వెంటనే షూటింగ్‌ కు పూర్వపు ఉత్సాహంతో హాజరు అవ్వాలని సన్నిహితులు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చిరంజీవి ఆరోగ్య పరిస్థితి పై సోషల్‌ మీడియాలో వివిధ పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఆ పుకార్లకు వెంటనే మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారనే ఒక తీపి కబురు ఫ్యామిలీ నుంచి వస్తే కచ్చితంగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటారు. మెగా స్టార్‌ ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేయడం మొదలు పెట్టారు. చికెన్ గున్యా తో బాధపడుతున్న చిరంజీవి పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో నెల రోజుల సమయం పట్టవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటనేది తెలియాల్సి ఉంది.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర రూపొందుతున్న విషయం తెల్సిందే. రికార్డ్‌ స్థాయి వసూళ్లు టార్గెట్‌ తో ఈ సినిమా రాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. వంశీ, ప్రమోద్‌ లు ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. చిరంజీవికి జోడీగా త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోంది. చిరంజీవి చాలా కాలం తర్వాత సోషియో ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగా సినిమా ఉంటుందేమో చూడాలి.


?