Begin typing your search above and press return to search.

క్లోజ్ ప్రెండ్స్ ఇద్ద‌రు ద‌స‌రాని భ‌లే ప్లాన్ చేసారే!

నిన్న‌టితో ద‌స‌రా న‌వ‌రాత్రులు ఘ‌నంగా ముగిసాయి. ప‌ది రోజ‌ల పాటు ఉత్స‌వాల‌తో తెలుగు రాష్ట్రాలు శోభాయ‌మానంగా మారాయి.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:36 AM GMT
క్లోజ్ ప్రెండ్స్ ఇద్ద‌రు ద‌స‌రాని భ‌లే ప్లాన్ చేసారే!
X

నిన్న‌టితో ద‌స‌రా న‌వ‌రాత్రులు ఘ‌నంగా ముగిసాయి. ప‌ది రోజ‌ల పాటు ఉత్స‌వాల‌తో తెలుగు రాష్ట్రాలు శోభాయ‌మానంగా మారాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జున ఎయిర్ పోర్టులో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు ముస్తాబై క‌న‌ప‌డ‌టంతో? అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌స‌రా ఇద్ద‌రు ఎక్క‌డికి వెళ్తున్నార‌ని ఎన్నో సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి.

కానీ అస‌లు సంగ‌తి ఇది అని తెలుస్తోంది. ఈసారి ఇద్ద‌రు క‌లిసి ద‌స‌రాని సెల‌బ్రేట్ చేసుకున్నారు. అందుకు ఓ ప్ర‌ముఖ బంగారు ఆభ‌ర‌ణాల తయారీ సంస్థ ముందుకొచ్చింది. కేరళలోని త్రిసూర్ లో జరిగిన ఈ శరన్నవరాత్రి సంబరాల‌కే చిరంజీవి- నాగార్జున సంస్థ అధినేత ప్ర‌త్యేక ఆహ్వానం మేర‌కు క‌లిసి వెళ్లారు. ఇద్ద‌ర్నీ ఓ స్పెష‌ల్ ప్లైట్ లో ఆయ‌న కేర‌ళ‌కు తీసుకెళ్లారు.

ఈ వేడుకల్లో సంస్థ‌ అధినేత‌తో పాటు చిరంజీవి, నాగార్జున కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బొమ్మల కొలువును సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌రించ‌డంతోనే ఇది సాధ్య‌మైన‌ట్లు తెలుస్తోంది.

చిరంజీవి-నాగార్జున క్లోజ్ ప్రెండ్స్ అన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవిని నాగార్జున త‌న అన్న‌య్య‌లా భావిస్తుంటారు. ఇద్ద‌రు బిజినెస్ పార్ట‌న‌ర్లు కూడా. క‌లిసి పార్టీలు చేసుకుంటారు. ఇటీవ‌లే చిరంజీవి ఇంట్లో ఫిష్ పార్టీ కూడా జ‌రిగింది. చిరంజీవి స్వ‌యంగా చేప‌ల కర్రీ వండి నాగార్జున‌కు వ‌డ్డించారు. చిరంజీవి ఇంట్లో ఎవ‌రూ లేని సంద‌ర్భంలో మెగాస్టార్ ఇలా ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.