Begin typing your search above and press return to search.

పుట్టిన రోజున మెగాస్టార్‌ స్పెషల్‌..!

ఫ్యాన్స్‌ మొత్తం కూడా మెగా వేడుకలో బిజీగా ఉన్నారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Aug 2024 9:14 AM GMT
పుట్టిన రోజున మెగాస్టార్‌ స్పెషల్‌..!
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ ఎవరికి తోచిన విధంగా వారు సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉన్నారు. ఏపీ ఇంకా తెలంగాణలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. రోగులకు పండ్లు పంచి పెట్టడంతో పాటు, అనాధల మధ్య కొందరు మెగా ఫ్యాన్స్ చిరంజీవి పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే.

ఫ్యాన్స్‌ మొత్తం కూడా మెగా వేడుకలో బిజీగా ఉన్నారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ అన్నయ్య అవ్వడంతో పాటు, మెగాస్టార్‌ చిరంజీవికి ఉన్న స్టార్‌ డమ్‌ తో తిరుమల తిరుపతి దేవస్థానంలో లాంచన స్వాగతం లభించింది. ఏకంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు ఇంకా అధికారులు దగ్గర ఉండి మరీ చిరంజీవి ఇంకా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కి స్వామి వారి దర్శనం చేయించారు.

బుధవారం రాత్రి చిరంజీవి తిరుమల చేరుకున్నారు. అప్పటికే మెగాస్టార్‌ కోసం పద్మావతి గెస్ట్‌ హౌస్‌ ను అధికారులు సిద్దం చేశారు. గురువారం తెల్లవారుజామున భార్య సురేఖ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు, టీటీడీ అర్చకులు చిరంజీవి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిరంజీవికి మంత్రి స్వామివారి చిత్రపటం తో పాటు శేష వస్త్రం ను అందించారు.

చిరంజీవి తిరుమల లో ఉన్నారనే విషయం తెలిసి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మరియు సాధారణ జనాలు ఆయన్ను చూసేందుకు ఆసక్తి చూపించారు. దైవ దర్శనం తర్వాత చిరంజీవి బయటకు వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున జనాలు ఎగబడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది మరియు పోలీసులు వారిని అదుపు చేయలేక పోయారు. కొందరితో సెల్ఫీలు తీసుకున్న చిరంజీవి అక్కడ నుంచి మెల్లగా వెళ్లి పోయారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని కుటుంబ సన్నిహితులు మీడియాకు తెలియజేశారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్నాడు. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తో బింబిసార అనే సోషియో ఫాంటసీ సినిమాను రూపొందించి విజయాన్ని సొంతం చేసుకున్న వశిష్ట ఇప్పుడు చిరంజీవి తో చేస్తున్న విశ్వంభర కూడా అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అనే నమ్మకంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌ గా నటిస్తుండగా, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.