Begin typing your search above and press return to search.

'గేమ్ ఛేంజర్‌'... నిర్మాత షాకింగ్ ప్రకటన

గేమ్‌ ఛేంజర్ ను ఖచ్చితంగా ఈ ఏడాదిలో విడుదల చేస్తాం అనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు.

By:  Tupaki Desk   |   29 May 2024 5:17 AM GMT
గేమ్ ఛేంజర్‌... నిర్మాత షాకింగ్ ప్రకటన
X

రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా విడుదల తేదీ విషయమై గందరగోళం నెలకొంది. దిల్‌ రాజు ఈ సినిమాను ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని భావించినా కూడా సాధ్యం అవ్వలేదు.

గేమ్‌ ఛేంజర్ ను ఖచ్చితంగా ఈ ఏడాదిలో విడుదల చేస్తాం అనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. దర్శకుడు శంకర్‌ కూడా ఇదే ఏడాది గేమ్‌ ఛేంజర్ ఉంటుంది అంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడు అనే విషయంలో మాత్రం ఇన్ని రోజులు క్లారిటీ లేదు.

ఎట్టకేలకు సినిమా విడుదల విషయంలో ఒక స్పష్టత వచ్చింది. నిర్మాత దిల్‌ రాజు కూతురు హన్షిత రెడ్డి ఇటీవల ఒక చిట్‌ చాట్‌ లో మాట్లాడుతూ గేమ్‌ ఛేంజర్ సినిమా విడుదల అక్టోబర్ లో ఉంటుందని ప్రకటన చేసింది. ఆమె చేసిన ప్రకటన ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే అక్టోబర్‌ లో ఎన్టీఆర్‌ దేవర సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా డేట్‌ తో సహా అధికారికంగా ప్రకటించారు. అదే నెలలో బాలయ్య నటిస్తున్న బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను అక్టోబర్‌ లో విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

బాబాయి, అబ్బాయి పోటీ తప్పదు అనుకుంటూ ఉన్న సమయంలో అదే అక్టోబర్‌ లో మా సినిమా కూడా వస్తుంది అంటూ గేమ్‌ ఛేంజర్ నిర్మాత నుంచి ప్రకటన రావడం షాకింగ్ గా ఉందంటూ మీడియా సర్కిల్స్ వారితో పాటు ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ ల నుంచి రాబోతున్న సినిమాలు ఇవే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంతటి అంచనాలు ఉన్న సినిమాలను ఒకే నెలలో విడుదల చేయడం అనేది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం అవుతుంది అనేది సినీ విశ్లేషకుల మరియు బాక్సాఫీస్ వర్గాల మాట.

దిల్‌ రాజు నుంచి అధికారికంగా గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్ డేట్ ప్రకటన రావాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పోటీ లేని సమయంలో విడుదల చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. కనుక ఏ ఒక్క సినిమాకు ఇబ్బంది లేకుండా రిలీజ్ ప్లాన్‌ చేయడం మంచిది.