Begin typing your search above and press return to search.

మ‌ర్డర్ కేసులో ట్విస్ట్..మ‌రో హీరోకి నోటీసులు!

రేణుకా స్వామి హ‌త్య కేసులో రోజుకో ట్విస్ట్ తెర‌పైకి వ‌స్తోంది. హ‌త్య‌లో ఎంత మంది భాగ‌స్వాములో అర్దం కాని స‌న్నివేశం క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 8:46 AM GMT
మ‌ర్డర్ కేసులో ట్విస్ట్..మ‌రో హీరోకి నోటీసులు!
X

రేణుకా స్వామి హ‌త్య కేసులో రోజుకో ట్విస్ట్ తెర‌పైకి వ‌స్తోంది. హ‌త్య‌లో ఎంత మంది భాగ‌స్వాములో అర్దం కాని స‌న్నివేశం క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌న‌, ప‌విత్ర‌తో పాటు 15మంది అవ‌రెస్ట్ అవ్వ‌గా, మ‌రొక‌రిద్ద‌రు ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ కేసులో వాళ్ల భాగ‌స్వామ్యం ఎంత అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అదంతా ప‌క్క‌న‌బెడితే తాజాగా ఇదే కేసులో మ‌రో క‌న్న‌డ న‌టుడు చిక్క‌న్న‌కు పోలీస్ లు నోటీజ‌సులు జారీ చేయ‌డం స‌చల‌నంగా మారింది.

నిన్న మొన్న‌టివ‌ర‌కూ చిక్క‌న్న పేరు ఎక్క‌డా వినిపించ‌క‌పోగా ఒక్క‌సారిగా తెర‌పైకి రావ‌డంతో సంచ‌ల‌నంగా మారింది. హ‌త్య జ‌ర‌గ‌డానికి ముందు ద‌ర్శ‌న్ తో పాటు , అత‌డి మ‌నుషులు, బెంగుళూరు రాజేశ్వ‌రి న‌గ‌ర్ లోని స్టోనీ బ్రూక్ రెస్టారెంట్ లో పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి ద‌ర్శ‌న్ స్నేహితుడు, న‌టుడు చిక్క‌న్న కూడా హాజ‌ర‌య్యాడు. ఈ నేప‌థ్యంలో పార్టీ స‌మ‌యంలో హ‌త్య గురించి స్నేహితిడుతో కూడా ద‌ర్శ‌న్ చ‌ర్చించాడా? అన్న అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే పోలీసుల‌కు చిక్క‌న్న కు కూడా నోటీసులు జారీ చేసారు. అత‌డిని విచారిస్తే మ‌రింత స‌మాచారం బ‌య‌టకు వస్తుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. త‌న‌కు తెలియ‌ని మ‌నుషుల తోనే ద‌ర్శ‌న్ హత్య గురించి ప‌థ‌కం ర‌చించిన‌ప్పుడు, ప్ర‌త్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి చిక్కన్న కూడా హాజ‌ర‌య్యాడంటే? అత‌డికి కీల‌క విష‌యాలు తెలిసే అవ‌కాశం ఉంటుంద‌ని పోలీసులు అనుమా నిస్తున్నారు.

మ‌రి అదెంత వ‌ర‌కూ నిజం అన్న‌ది చిక్క‌న్న విచార‌ణ అనంత‌రం తెలుస్తుంది. మ‌రోవైపు ప‌రారైన వారి కోసం ప్ర‌త్యేక పోలీసు బృందం వెతికి ప‌ట్టుకునే ప‌నిలో ఉంది. ఈ కేసు విష‌యంలో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి కూడా ద‌ర్శ‌న్ పై వ్య‌తిరేక ప‌వ‌నాలే మొద‌టి నుంచి వీస్తున్నాయి. న‌టి , మాజీ ఎంపీ ర‌మ్య నంబీస‌న్ కూడా ఉరిశిక్ష విధించాలంటూ ఓ పోస్ట్ షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.