Begin typing your search above and press return to search.

'కమిటీ కుర్రోళ్ళు.. నిహారిక ప్లాన్ క్లిక్కయ్యేనా?

నిర్మాతలు పద్మజా కొణిదెల, జయలక్ష్మి అదపాకలతో పాటు చిత్రానికి సాయి ధరమ్ తేజ్, అడివి శేష్ వంటి హీరోలు కూడా తమ మద్దతు తెలిపారు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 12:31 PM GMT
కమిటీ కుర్రోళ్ళు.. నిహారిక ప్లాన్ క్లిక్కయ్యేనా?
X

మెగా వారసురాలు నిహారిక కొణిదెల నిర్మాతగా మారి కొత్త వారితో సినిమాను నిర్మించడం ఇండస్ట్రీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొత్త చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు' భారీ పోటీ మధ్య ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో యధు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు విడుదల ముందు భారీ స్థాయిలో ప్రచారం జరిగింది.

టీజర్, ట్రైలర్, రిలీజింగ్ ట్రైలర్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక సినిమాకు వర్క్ చేసిన వారు ఒక తీపి జ్ఞాపకాలను కలిగించే ఫీలింగ్ లా సినిమా ఉంటుందని అంటున్నారు. విజువల్స్, ఫ్రేమ్స్, మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకులకు ఓ నెజాల్జిక్ అనుభూతిని అందించబోతున్నాయని ట్రైలర్ చూసినవారు పేర్కొంటున్నారు.

ప్రోమోషనల్ క్యాంపెయిన్‌లో సినీ యూనిట్ చూపిన క్రియేటివిటీ ఈ సినిమా మీద ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో టీమ్ ఈ చిత్ర విజయం పట్ల ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. హై ప్రొడక్షన్ వాల్యూస్, ఆసక్తికరమైన కంటెంట్ తో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావంతో ఉంది.

నిర్మాతలు పద్మజా కొణిదెల, జయలక్ష్మి అదపాకలతో పాటు చిత్రానికి సాయి ధరమ్ తేజ్, అడివి శేష్ వంటి హీరోలు కూడా తమ మద్దతు తెలిపారు. వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాపై ఉన్న తన ఆసక్తిని వ్యక్తపరిచారు. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉంది. ఈ సినిమా విజయవంతం కావడం, చిత్రబృందానికి ఒక పెద్ద విజయాన్ని అందిస్తుందనే ఆశలను కలిగిస్తోంది.

సమాజంలోని సాధారణ జీవితాలు, స్నేహితుల మధ్య సంబంధాలు వంటి అంశాలను తీసుకొని, ఆడియన్స్ తో ఒక భావోద్వేగ అనుభూతిని కలిగించడానికి యధు వంశీ దృష్టి సారించారట. ఫలితంగా ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ చిత్రం కమర్షియల్ గా, విమర్శకుల ప్రశంసలతో ఏ రేంజ్ విజయం సాధిస్తుందో చూడాలి.