Begin typing your search above and press return to search.

కమిటీ కుర్రాళ్ళు బాక్సాఫీస్ మోత.. టాప్ స్టార్స్ ఫిదా

ఇదిలా ఉంటే కమిటీ కుర్రోళ్ళు సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ఏకంగా 7.48 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.

By:  Tupaki Desk   |   13 Aug 2024 9:34 AM GMT
కమిటీ కుర్రాళ్ళు బాక్సాఫీస్ మోత.. టాప్ స్టార్స్ ఫిదా
X

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకి ప్రేక్షకాదరణ ఎక్కువగా లభిస్తోంది. గత ఏడాది బలగం చిన్న బడ్జెట్ చిత్రంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాదిలో సుహాస్ నటించిన ప్రసన్నవదనం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ జెనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్, బలమైన ఎమోషన్స్ కథలో ఉంటే కచ్చితంగా మూవీ సూపర్ హిట్ అవుతుందని చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఈ వరుసలో నిహారిక కొణెదల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' కూడా కూడా చేరిందని చెప్పాలి.

వంశీ నందపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. డిజిటల్ స్పేస్ లో నిర్మాతగా సక్సెస్ అయిన మెగా డాటర్ నిహారిక కొణెదల కమిటీ కుర్రాళ్ళు సినిమాతో ప్రొడ్యూసర్ గా బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టింది. అమలాపురం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథని ఆవిష్కరించారు. 11 మంది కొత్త యాక్టర్స్ ని కమిటీ కుర్రోళ్ళు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేశారు.

ఆగష్టు 9న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. గ్రామీణ నేపథ్యంలో జ్ఞాపకాలని గుర్తుచేసే విధంగా కథ ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే దర్శకుడు వంశీ ఈ చిత్రంలో విలేజ్ పాలిటిక్స్ ని టచ్ చేశాడు. ఇదిలా ఉంటే కమిటీ కుర్రోళ్ళు సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ఏకంగా 7.48 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే రిలీజ్ అయిన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అందుకుందని పోస్టర్ లో కన్ఫర్మ్ చేశారు.

మరో వైపు ఈ సినిమా సక్సెస్ పై స్టార్ సెలబ్రెటీలు కూడా రియాక్ట్ అయ్యి ట్వీట్స్ వేయడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నాచురల్ స్టార్ నాని లాంటి స్టార్స్ అందరూ చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు. ఈ మూవీ రోలర్ కోస్టర్ లా ఉంది. ప్రేమ, స్నేహం వంటి ఎమోషన్స్ ని అద్భుతంగా ఆవిష్కరించారు. యదువంశీ టేకింగ్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గొప్పగా ఉన్నాయని డైరెక్టర్ క్రిష్ ప్రశంసించారు. నిర్మాతగా సక్సెస్ అందుకున్న నిహారికకి అభినందనలు తెలిపారు.

కమిటీ కుర్రోళ్ళు టీమ్ మొత్తానికి అభినందనలు… చాలా మంది యంగ్ టాలెంట్ ఈ చిత్రంతో తమని తాము ప్రూవ్ చేసుకున్నారని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. అలాగే కమిటీ కుర్రోళ్ళు మంచి విజయం సాధించిందనే న్యూస్ విన్నాము. నిర్మాతగా మొదటి ప్రయత్నంలోనే గొప్ప సక్సెస్ అందుకున్నందుకు నిహారికకి కంగ్రాట్స్, అలాగే దర్శకుడు యదువంశీకి కూడా అభినందనలు అని దర్శకులు రాజమౌళి, సుకుమార్ ట్వీట్ చేశారు. తొలి చిత్రంతోనే మంచి విజయం అందుకున్న నిహారికకి అభినందనలు. ఇలాంటి విజయాలు మీరు మరిన్ని అందుకోవాలి అంటూ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. ఇలా టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రెటీలు నిహారికతో పాటు కమిటీ కుర్రోళ్ళు మూవీ టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు.