Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేష‌న్స్..ర్యాపో మామూలుగా లేదే!

అందుకే మ‌రోసారి విక్ట‌రీ వెంక‌టేష్ తో ఈ ద్వ‌యం మ‌రో సినిమా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jun 2024 3:00 AM GMT
ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేష‌న్స్..ర్యాపో మామూలుగా లేదే!
X

హీరో-డైరెక్ట‌ర్ కాంబినేష‌న్స్ అనేవి ఎక్కువ‌గా రిపీట్ అవుతుంటాయి. కానీ నిర్మాత‌- డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ అనేది రిపీట్ అవ్వ‌డం త‌క్కువ‌గా ఉంటుంది. ఎంతో ర్యాపో ఉంటో తప్ప అది సాధ్యం కాదు. తాజాగా అలాంటి కాంబినేష‌న్ లు కొన్ని క‌నిపిస్తున్నాయి. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే అనీల్ రావిపూడి-దిల్ రాజు కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే నాలుగు సినిమాలొచ్చాయి. 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్-2', ' 'ఎఫ్-3' చిత్రాలు వ‌చ్చాయి. దీంతో ఈ ద్వ‌యం డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసింది. మ‌రో రెండు విజ‌యాలు ప‌డితే డ‌బుల్ హ్యాట్రిక్ అయిన‌ట్లే. అందుకే మ‌రోసారి విక్ట‌రీ వెంక‌టేష్ తో ఈ ద్వ‌యం మ‌రో సినిమా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

'సంక్రాంతికి వ‌స్తున్నాం' అనే టైటిల్ తో రూపొందుతున్న మ‌రో ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్. అలాగే సుకుమార్-మైత్రీ మూవీ మేక‌ర్స్ బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలిసారి 'రంగ‌స్థ‌లం'తో మొద‌లైన ప్ర‌స్థానం కొన‌సాగుతుంది. అటుపై అదే సంస్థ‌ను 'పుష్ప‌'తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ చేసాడు సుకుమార్. అదే సంస్థ‌లో మూడ‌వ సినిమా 'పుష్ప‌-3' తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది హిట్ అయితే ఆ సంస్థ‌లో సుకుమార్ హ్యాట్రిక్ న‌మోదు చేసిన‌ట్లే. అలాగే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా 'ఉప్పెన' త‌ర్వాత రెండ‌వ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ తో మైత్రీలోనే చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక శేఖ‌ర్ క‌మ్ములా- సునీల్ నారంగ్, పుష్క‌ర్ రామ్మోహ‌న్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న రెండ‌వ సినిమా 'కుభేర‌'. ఇదే కాంబినేష‌న్ లో వ‌చ్చిన తొలి చిత్రం 'ల‌వ్ స్టోరీ' మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అలాగే డైరెక్ట‌ర్ నాగ‌వంశీకి మామ అశ్వినీద‌త్ బ్యానర్ హోమ్ బ్యాన‌ర్ లాంటింది. ఇప్పటికే ఈ సంస్థ‌లో నాగ్ అశ్విన్ 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం', 'మ‌హాన‌టి' తెర‌కెక్కించి మంచి విజ‌యాలు అందించాడు. ప్ర‌స్తుతం 'క‌ల్కి 2898' రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక వెంకీ అట్లూరీ- నాగ వంశీ సూర్య‌దేవ‌ర కాంబోలో తెర‌కెక్కిన 'సార్' మంచి విజ‌యం సాధించింది.

దీంతో మరోసారి అదే బ్యాన‌ర్ లో 'ల‌క్కీ భాస్క‌ర్' తెర‌కెక్కిస్తున్నాడు వెంకీ. ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. 'హ‌నుమాన్' పాన్ ఇండియాలో సంచ‌ల‌నం అయిన నిర్మాత నిరంజ‌న్ రెడ్డి- ప్ర‌శాంత్ వ‌ర్మ 'జైహ‌నుమాన్' అనే మ‌రో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. 2025 లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే 'ఈగ‌ల్' త‌ర్వాత కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని-పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీ కాంబోలో 'మిరాయ్' అనే సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా విడుద‌ల కానుంది. అలాగే మ‌ళ్లీ 'ద‌సరా' కాంబో కూడా సెట్ అయింది. నాని- శ్రీకాంత్- సుధాక‌ర్ త్ర‌యం మ‌రో భారీ ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇది నానికి 33వ సినిమా. ఇంకా ఇలాంటి కాంబినేష‌న్లు చాలానే ఉన్నాయి.