Begin typing your search above and press return to search.

క్రేజీ మల్టీ స్టారర్.. ఊహకే అందదు?

కొత్త కథలతో దర్శకులు వస్తే మల్టీ స్టారర్ మూవీస్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 4:48 AM GMT
క్రేజీ మల్టీ స్టారర్.. ఊహకే అందదు?
X

ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ సినిమాలు సౌత్ లో కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు హీరోలు సోలోగా ఇమేజ్ పెంచుకోవడానికి ఆసక్తి చూపించేవారు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ట్రెండ్ పూర్తిగా మారింది. హీరోల మైండ్ సెట్స్ కూడా చేంజ్ అయ్యాయి. కొత్త కథలతో దర్శకులు వస్తే మల్టీ స్టారర్ మూవీస్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ధనుష్, నాగార్జున కలిసి శేఖర్ కమ్ముల చిత్రంలో నటిస్తున్నారు.


అలాగే నాగార్జున నా సామి రంగా మూవీలో రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ఉన్నారు. ఎన్ఠీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటించబోతున్నాడు. భాషలతో సంబంధం లేకుండా స్టార్స్ జతకట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఈ కారణంగా సినిమాకి గ్రాండ్ నెస్ పెరగడంతో పాటు మార్కెట్ లెక్కలు కూడా మారుతున్నాయి.

ఇప్పుడు మరో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రేమ్ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని ఈ తమిళ్, తెలుగు హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడంట. రీసెంట్ గా దయ అనే వెబ్ సిరీస్ తో మరోసారి పవన్ సాదినేని సత్తా చాటాడు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్, కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబోలో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. సౌత్ లో ఈ ఇద్దరు హీరోలు కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా కొత్త కథలతో మూవీస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.

అలాంటి వీరిద్దరితో మూవీ అంటే కచ్చితంగా తెలుగు, తమిళ్ భాషలలో మంచి ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందనేది చూడాలి.