Begin typing your search above and press return to search.

మ‌ర్డ‌ర్ కేసులో హీరో కుమారుడు ఎమోష‌న‌ల్ పోస్ట్!

క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిం దే.

By:  Tupaki Desk   |   14 Jun 2024 6:11 AM GMT
మ‌ర్డ‌ర్ కేసులో హీరో కుమారుడు ఎమోష‌న‌ల్ పోస్ట్!
X

క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిం దే. ప్రియురాలు ప‌విత్ర కోసం ద‌ర్శ‌న్ తెగ‌బ‌డిన తీరుపై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. ఇలాంటి వారికి ఉరిశిక్ష వేయాలంటూ న‌టీ ర‌మ్య‌నంబీస‌న్ సైతం రీట్వీట్ చేయ‌డం తెలిసిందే. అలాగే అదే ద‌ర్శ‌న్ పై సానుభూతి కూడా అలాగే క‌నిపిస్తుంది. ప‌విత్ర న‌టుడి జీవితాన్ని నాశ‌నం చేసింద‌ని మ‌రికొంత మంది పోస్టులు పెడుతున్నారు.

ప‌విత్ర కారణంగానే భార్య కుమారుడికి దూర‌మ‌వుతున్నాడ‌ని ఆవేద‌న చెందుతోన్న అభిమానులున్నారు. ఈ విష‌యంలో ప‌విత్ర కూడా త‌ప్పు చేసాన‌ని వ్యాఖ్యానించింది. అన‌వ‌స‌రంగా త‌న‌పై జ‌రిగిన దాడి గురించి ద‌ర్శ‌న్ కి చెప్పి త‌ప్పు చేసాన‌ని ఆమె కూడా బాధ‌ప‌డుతుంది. `రేణుకా స్వామి ఇదే విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఇంత జ‌రిగేది కాదు. ఎవ‌రూ ఇలాంటి స‌మ‌స్య‌లో ప‌డే వాళ్లం కాదు అని చెప్పింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ద‌ర్శ‌న్ కుమారుడు వినీశ్ తూగుదీ ఎమోష‌నల్ పోస్ట్ పెట్టాడు. `నా తండ్రి ద‌ర్శ‌న్ తో పాటు త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికి మాన‌సిక ప్ర‌శాంత‌త అవ‌స‌రం. నా తండ్రిని బూతుల‌తో దూషిస్తున్న మీ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. మీ కోపం ఇప్ప‌టికైనా చ‌ల్లారిందా? నా తండ్రి హ‌త్య చేసాడు అంటే నేను న‌మ్మ‌డం లేదు. పోలీసుల ద‌ర్యాప్తు పూర్త‌యిన త‌ర్వాత అస‌ల విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

అంత‌వ‌ర‌కూ కాస్త ఓపిక ప‌ట్టండి. స‌హ‌నం కోల్పోయి పోస్టులు పెట్టొద్దు. నిజా నిజాలు తేలేవ‌ర‌కూ ఎదుట వారిని నిందించొద్దు` అంటూ రాసుకొచ్చాడు. ఈ కేసులో ఇప్ప‌టికే ప‌ది మందికి పైగా అరెస్ట్ అయ్యారు. వాళ్లంద‌ర్నీ పోలీసులు విచారిస్తున్నారు. మ‌రి ఇందులో ఎవ‌రు ప్ర‌ధాన నింతుడు ? అన్న‌ది తేలాల్సి ఉంది. ప్రాధ‌మిక ద‌ర్యాప్తులో ద‌ర్శ‌న్ పేరు ఏవ‌న్ గా క‌నిపిస్తోంది.