Begin typing your search above and press return to search.

హార‌ర్ సినిమా నైజాం హ‌క్కులు మైత్రి చేతికి

నటుడు అరుళ్ నితి, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు 7 సంవత్సరాల తర్వాత డీమాంటే కాలనీ సీక్వెల్ కోసం మరోసారి క‌లిసి ప‌ని చేసారు.

By:  Tupaki Desk   |   18 Aug 2024 2:11 PM GMT
హార‌ర్ సినిమా నైజాం హ‌క్కులు మైత్రి చేతికి
X

2015 తమిళ హార‌ర్ చిత్రం `డిమోంటే కాలనీ` చ‌క్క‌ని విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఒక హాంటెడ్ హౌస్‌లోకి చొరబడిన నలుగురు స్నేహితుల జీవితం చుట్టూ తిరిగే క‌థతో ఈ సినిమా తెర‌కెక్కింది. నటుడు అరుళ్ నితి, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు 7 సంవత్సరాల తర్వాత డీమాంటే కాలనీ సీక్వెల్ కోసం మరోసారి క‌లిసి ప‌ని చేసారు.

డిమోంటే కాల‌నీ చిత్రానికి ప్రీక్వెల్ లేదా సీక్వెల్ ల‌ను తీసేందుకు అవ‌కాశం ఉంద‌ని ద‌ర్శ‌కుడు ఇంత‌కుముందే ప్ర‌క‌టించాడు. అనంత‌రం దీనిని ఫ్రాంచైజీగా మార్చాలని టీమ్ ప్లాన్ చేసింది. దాని కోసం ఇప్పటికే ద‌ర్శ‌కుడు మరో మూడు కథలను రాసారు. ఆ చిత్రాలను ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. డీమాంటే కాలనీ 2కి సంబంధించిన అన్ని సినిమాల్లో అరుళ్నిథి ఉండేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అత‌డితో పాటు ఒరిజిన‌ల్ లోని తారాగణం చాలా మంది కొత్తవారితో పాటు తిరిగి న‌టిస్తున్నారు.

ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ హారర్ చిత్రం `డిమోంటే కాల‌నీ 2`ని నైజాంలో మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఆ మేర‌కు అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విష‌యాన్ని మైత్రి సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈనెల 23న సినిమా థియేట‌ర్ల‌లోకి విడుద‌ల కానుంది. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇలాంటి హార‌ర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డం ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని మైత్రి సంస్థ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు మైత్రి మూవీ మేక‌ర్స్ తెలుగులో ప‌లు త‌మిళ అనువాదాల‌ను రిలీజ్ చేస్తోంది. ఇందులో కంగువ‌, ది గోట్ లాంటి భారీ చిత్రాలు ఉన్నాయి. కంగువ లో సూర్య న‌టించ‌గా, ది గోట్ చిత్రంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. ఇవి రెండూ భారీ పాన్ ఇండియా చిత్రాలు కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అలాగే తెలుగు అగ్ర క‌థానాయ‌కుల‌తో భారీ పాన్ ఇండియా చిత్రాల‌ను మైత్రి సంస్థ‌ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, బ‌న్ని, మ‌హేష్, ప్ర‌భాస్ లాంటి అగ్ర హీరోల‌తో మైత్రి సంస్థ వ‌రుస చిత్రాల‌ను నిర్మిస్తోంది.