Begin typing your search above and press return to search.

'గదర్ 2' స్క్రీనింగ్‌లో టోట‌ల్ డియోల్ ఫ్యామిలీ ధ‌మాకా

ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రం విడుదలైన వారాంతంలో 'గదర్ 2' నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 4:59 AM GMT
గదర్ 2 స్క్రీనింగ్‌లో టోట‌ల్ డియోల్ ఫ్యామిలీ ధ‌మాకా
X

సన్నీడియోల్ - అమీషా పటేల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన 'గదర్ 2' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్‌ను కొన‌సాగిస్తోంది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలను అందుకుంది. నాలుగో వారాంతంలో ప‌ఠాన్ ని మించి గ‌ద‌ర్ 2 వ‌సూలు చేసింది అంటే ఇది ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌రో అర్థం చేసుకోవాలి.

ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రం విడుదలైన వారాంతంలో 'గదర్ 2' నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. సన్నీ డియోల్ -బాబీ డియోల్ వారి సోదరీమణులు ఈషా డియోల్, అహానా, ధర్మేంద్ర .. అతని రెండవ భార్య హేమా మాలిని కుమార్తెలతో అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

ఇది నిజానికి అరుదైన దృశ్యంగా భావించాలి. ఇప్పుడు ఇషాడియోల్ 'గదర్ 2' స్క్రీనింగ్ నుండి సన్నీ - బాబీతో వైరల్ ఫోటోల గురించి ఓపెనైంది. ఇది ఒక అందమైన అరుదైన‌ క్షణం అని వ్యాఖ్యానించింది.

తన సోదరులతో తన అనుబంధం గురించి ఇషా మాట్లాడింది. నిజాయితీగా చెప్పాలంటే ఈరోజు ఈ క‌ల‌యిక ఊహించ‌ని విధంగా కుదిరింది. ఇది ప్లాన్ చేయలేదు. మేము ఒక కుటుంబంగా చాలా ప్రైవేట్‌గా ఉన్నాము. మేము ఒకరిపట్ల ఒకరు చాలా గౌరవంగా ఉంటాము.

నేను అతనికి రాఖీ కట్టాలా వద్దా అనేది మరెవరికీ సంబంధించినది కాదని నేను భావిస్తున్నాను. కానీ మనం నటులమైనందున ప్రజలు ఆ క్షణం అంద‌రినీ ఇలా చూసి ఆశ్చ‌ర్య‌పోతారు. నేను చిన్నప్పటి నుండి మా సోదరులకు రాఖీ కట్టేదానిని.. మేము దానిని కొనసాగిస్తున్నాము. కానీ మేము ప్రజలకు క‌లిసి ఉన్నామ‌ని నిరూపించడానికి ఇక్కడికి రాలేదు'' అని తెలిపింది.