Begin typing your search above and press return to search.

దేవరకొండ బ్రదర్స్.. ఓ చిన్న గ్యాప్

విజయ్ దేవరకొండ, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు క్రేజ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు

By:  Tupaki Desk   |   19 Jun 2024 3:17 AM GMT
దేవరకొండ బ్రదర్స్.. ఓ చిన్న గ్యాప్
X

విజయ్ దేవరకొండ, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు క్రేజ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. 'లైగర్' తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా విజయ్ 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఆశించినంత విజయం సాధించలేదు. అయినప్పటికీ, విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ధ పెడుతున్నారు.

ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఆ మధ్య విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర మేకర్స్ స్పెషల్ విషెస్ తెలియజేసి, త్వరలోనే సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ గ్లింప్స్ జూన్ చివర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు దేవరకొండ బ్రదర్ బేబీ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా గంగం గణేశా అనే సినిమాతో వచ్చాడు. ఇక ప్రస్తుతం మరో రెండు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. అయితే దేవరకొండ బ్రదర్స్ మొన్నటి వరకు వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండగా ఇప్పుడు ఫ్యామిలీ తో కలిసి ట్రిప్ ప్లాన్ చేశారు. అమెరికా వెళ్లి కొన్ని రోజులు హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ రవికిరణ్ కోలాతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. 'రాజాగారు రాణిగారు' ఫేమ్ రవికిరణ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

రూరల్ యాక్షన్ డ్రామా గా రూపొందనున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా నుంచి మొదట రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. "కత్తి నాదే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే" అనే రైటప్ తో మరింత అంచనాలు పెరిగాయి. మరోవైపు, ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సాయి పల్లవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని, అందుకే ఆమెను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి 'తండేల్' మూవీలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.