Begin typing your search above and press return to search.

రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ ఘ‌న‌మైన ప్ర‌క‌ట‌న‌!

జాతీయ అవార్డ్ విజేత, స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ తన ఇండియా టూర్ గురించి పెద్ద ప్ర‌క‌ట‌న చేసారు

By:  Tupaki Desk   |   25 Jun 2024 4:19 PM GMT
రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ ఘ‌న‌మైన ప్ర‌క‌ట‌న‌!
X

జాతీయ అవార్డ్ విజేత, స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ తన ఇండియా టూర్ గురించి పెద్ద ప్ర‌క‌ట‌న చేసారు. ఇదే సంద‌ర్భంలో పుష్ప 2 గురించి మ‌న‌సు విప్పాడు. తాజాగా ఓ మీటింగ్‌లో దేవీ మాట్లాడుతూ..ఇప్పుడే నా భారతదేశ పర్యటనను ప్రకటించాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో నేను ప్రపంచమంతటా ప్రదర్శనలు ఇస్తున్నాను. చాలా మంది ప్రజలు భారతదేశంలో ఈ షో ఎప్పుడు జరుగుతుంది? అంటూ అడుగుతున్నారు. నేను కూడా ఈ భారత పర్యటనను ప్రకటించడానికి వేచి ఉన్నాను. ఇప్పుడే నేను ప్రకటించేశాను.. అని రాక్ స్టార్ దేవీశ్రీ‌ అన్నారు.

నేను భారతదేశంలోని ప‌లు రాష్ట్రాలు, నగరాల్లో ప్రదర్శన ఇస్తానని దేవీశ్రీ ప్ర‌సాద్ ప్ర‌క‌టించారు. గౌహతిలో అస్సాం స్టేట్ ఫిల్మ్ (ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్) కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి అస్సాం కల్చరల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఫిల్మ్ మ్యూజిక్ సెమినార్ కార్యక్రమానికి ఆదివారం దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. తన భారత పర్యటన సందర్భంగా స్థానిక ప్రతిభను ఉపయోగించి అస్సాంలో కచేరీని ప్లాన్ చేయవచ్చని అతడు అన్నారు. దేశంలో టూర్ ప్లాన్ చేస్తున్నా. అస్సాంకు వచ్చిన తర్వాత అస్సాంలో ఏదైనా చేయాలని నేను అనుకున్నాను. స్థానిక ప్రతిభను ఉపయోగించి అస్సాంలో కచేరీ చేయాలనే ప్లాన్ వ‌చ్చింది.. అని దేవీ అన్నారు.

దేవి శ్రీ ప్రసాద్ ప్ర‌స్తుతం సౌతిండియాలోనే బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. అత‌డు వ‌రుస‌గా అర‌డ‌జ‌ను పైగానే సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్, సూర్య కంగువ సహా అనేక ప్రాజెక్ట్‌లతో అత‌డు బిజీ. త‌మిళం హిందీ చిత్రాల‌కు దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. కొన్ని హిందీ సినిమాలు .. సింగిల్ ఆల్బ‌మ్స్ .. మ్యూజిక్ వీడియోలు కూడా అత‌డి నుంచి రాబోతున్నాయి.