Begin typing your search above and press return to search.

రాయ‌న్ ఈవెంట్లో ధ‌నుష్ ఎమోష‌నల్!

ధనుష్ స‌హా పలువురు తారాగణం సిబ్బంది వేడుక‌కు హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   22 July 2024 4:33 AM GMT
రాయ‌న్ ఈవెంట్లో ధ‌నుష్ ఎమోష‌నల్!
X

కోలీవుడ్ స్టార్ ధనుష్ న‌టించిన‌ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'రాయన్‌' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 26 న విడుదల కానుంది. తెలుగు నటుడు సందీప్ కిషన్ ఇందులో కీలక పాత్రలో నటించారు. రాయన్ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ గత రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ధనుష్ స‌హా పలువురు తారాగణం సిబ్బంది వేడుక‌కు హాజరయ్యారు.

ఈ వేడుక‌లో స్టార్ హీరో ధ‌నుష్ ఎమోష‌న‌ల్ స్పీచ్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అత‌డు సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ని లెజెండ్ అని కీర్తించారు. త‌న చిత్ర‌బృందానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. నా సినిమాల ఏవీలు చూసిన‌ప్పుడు అందులో ఎన్నో త‌ప్పులు క‌నిపిస్తుంటాయి. మీడియా విమ‌ర్శించినా లేదా నేను తెర‌పై చూసుకున్నా ఏదో ఒక త‌ప్పు క‌నిపిస్తూనే ఉంటాయి`` అని ధ‌నుష్ అన్నారు. త‌ప్పుల నుంచి నేర్చుకుంటామ‌ని కూడా అన్నారు. త‌ప్పులు చేసినందుకు థాంక్స్ అని కూడా వ్యాఖ్యానించారు. అలాగే త‌న నిర్మాత క‌ళానిధి మార‌న్.. సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్.రెహ‌మాన్ అంద‌రికీ ప్ర‌త్యేకించి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

రాయన్‌లో ఎస్‌జె సూర్య, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్‌ సహా భారీ తారాగణం న‌టించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ప్ర‌కాష్ రాజ్‌ని డైరెక్ట్ చేస్తాడ‌ట‌:

ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్ రాజ్ తో సినిమా గురించి హింట్ ఇచ్చారు. ప్ర‌కాష్ రాజ్-ధ‌నుష్‌- నిత్యామీనన్ కాంబినేష‌న్ మూవీకి సంబంధించిన హింట్ ఇచ్చారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు ధ‌నుష్‌ దర్శకత్వం వహించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కార్యరూపం దాల్చినట్లయితే ధనుష్ కి ద‌ర్శ‌కుడిగా నాలుగో చిత్రం అవుతుంది. ఈ ముగ్గురూ చివరిగా తిరుచిత్రంబలం (తెలుగులో తిరుగా విడుదలైంది)లో కలిసి పనిచేశారు. కొత్త‌ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.