Begin typing your search above and press return to search.

ధనుష్ మరో పవర్ఫుల్ కాంబో

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనదైన ఇమేజ్ తో దూసుకుపోతున్న ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 4:51 AM GMT
ధనుష్ మరో పవర్ఫుల్ కాంబో
X

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనదైన ఇమేజ్ తో దూసుకుపోతున్న ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా ఇది తెరకెక్కుతోంది.

సార్ సినిమాతో ధనుష్ తెలుగులోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయబోయే మూవీ మాత్రం డిఫరెంట్ కథతో ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ కి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా హెచ్ వినోత్ కి పేరుంది. సతురంగ వెట్టై మూవీతో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన వినోత్ కార్తీతో ఖాకీ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

తరువాత అజిత్ తో వరుసగా మూడు సినిమాలు చేశారు. నర్కొండ పరవై, వాలిమై, తునివు మూవీస్ చేశాడు. ఈ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. వాలిమై సినిమాలో టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా నటించాడు. వీటి తర్వాత కమల్ హాసన్ హెచ్ వినోత్ దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి టైం పడుతుందని తెలుస్తోంది.

దీంతో రీసెంట్ గా ధనుష్ కి ఇంటరెస్టింగ్ స్టొరీ చెప్పి ఒప్పించాడంట. ఈ చిత్రాన్ని లలిత్ కుమార్ సివెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట. అలాగే ఈ మూవీలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సునీల్ కోలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

ఈ చిత్రంతో మరో ఇంటరెస్టింగ్ రోల్ ని సునీల్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ మూవీ చేస్తున్నాడు. ధనుష్ తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత కమల్ హాసన్ సినిమాని వినోత్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉంది.