Begin typing your search above and press return to search.

భారీ మ‌ల్టీస్టార‌ర్ గా మారిన చిత్రం!

తాజాగా ఈ సినిమాలో మ‌రో ముగ్గురు స్టార్లు ఎంట‌ర్ అవ్వ‌డంతో మ‌ల్టీస్టార‌ర్ గా మారుతుంది.

By:  Tupaki Desk   |   16 July 2024 5:49 AM GMT
భారీ మ‌ల్టీస్టార‌ర్ గా మారిన చిత్రం!
X

కొన్ని సినిమాలు ప‌ట్టాలెక్కిన త‌ర్వాత వాటి రూపు రేఖ‌లు మారిపోతుంటాయి. సోలో హీరోగా మొద‌లైన ప్రాజెక్ట్ లు మ‌ల్టీస్టార‌ర్ గా ఛేంజ్ అవుతుంటాయి. అప్ప‌టిక‌ప్పుడు క‌థ‌లో మార్పులు అనివార్య‌మైన సంద‌ర్భంలో ఇలాంటి స‌న్నివేశాలు చోటు చేసుకుంటాయి. తాజాగా మ‌రో బాలీవుడ్ సినిమా భారీ మ‌ల్టీ స్టార‌ర్ గా మారుతుంది. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'ధురంద‌ర్' అనే అనే చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

దీన్ని గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మ‌రో ముగ్గురు స్టార్లు ఎంట‌ర్ అవ్వ‌డంతో మ‌ల్టీస్టార‌ర్ గా మారుతుంది. సంజ‌య్ ద‌త్, మాధ‌వ‌న్, అర్జున్ రాంపాల్ కీల‌క పాత్ర‌ల‌కు ఎంపిక‌య్యారు. సినిమా మొద‌లు నుంచి ముగింపు వ‌ర‌కూ ఈ ముగ్గురు పాత్ర‌లు సినిమాలో అత్యంత కీల‌కంగా ఉంటాయ‌ట‌. ఇందులో ర‌ణ‌వీర్ సింగ్ ఇంటిలిజెన్స్ అధికారి పాత్ర పోషిస్తున్నాడు.

మెయిన్ లీడ్ పోషించినా ఆ పాత్ర‌కు ధీటుగా ఈ మూడు పాత్ర‌లు ఉంటాయ‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. అలాగే సినిమా బ‌డ్జెట్ కూడా పెంచిన‌ట్లు చిత్ర‌వ‌ర్గాలు తెలిపాయి. ముందు అనుకున్న బ‌డ్జెట్ కంటే రెండింత‌లు బ‌డ్జెట్ పెరిగిన‌ట్లు తెలిపారు. ఏడాది చివ‌ర్లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని మిడ్ లో ప్రారంభించాల‌నుకున్నారు.

కానీ చివ‌రి నిమిషంలో క‌థ‌లో మార్పులు జ‌ర‌గ‌డంతో ఏడాది చివ‌రికి వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో కొత్త హీరోలు యాడ్ అవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ సింగ్ `సింగం ఎగైన్` లో బిజీగా ఉన్నాడు. అలాగే భార్య దీపికా ప‌దుకొణే గ‌ర్భవ‌తి కావ‌డంతో ఆమెకి కావాల్సినంత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నాడు. షూటింగ్ ఉంటే సెట్లో లేదంటే ఇంట్లోనే ఉంటున్నాడు.