Begin typing your search above and press return to search.

దర్శక హీరోలు హ్యాట్రిక్ హిట్టు కొడతారా?

ఇందులో భాగంగా ‘స్వ‌యంభూ’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   15 Oct 2024 12:30 PM GMT
దర్శక హీరోలు హ్యాట్రిక్ హిట్టు కొడతారా?
X

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ వైవిధ్యమైన సినిమాతో మంచి విజయాలు అందుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ‘కార్తికేయ 2’ చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకొన్న నిఖిల్‌.. దాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగా ‘స్వ‌యంభూ’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ‘ది ఇండియా హౌస్’ అనే మరో పాన్ ఇండియా మూవీ కూడా అతని లైనప్ లో వుంది. అయితే సడన్ గా నిఖిల్ హీరోగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడం అందరికీ షాకింగ్ గా అనిపించింది.

నిఖిల్ సిద్దార్థ, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇటీవల మేకర్స్ ఈ మూవీని అనౌన్స్ చేసి, టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు దీపావళికి రిలీజ్ అవుతుందని తెలిపారు. ఇదే క్రమంలో టీజర్ ను లాంఛ్ చేసి, న‌వంబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నామ‌ని ప్రకటించారు. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు తీశారు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు రిలీజ్ ప్లాన్ చేశారు? అనే ప్రశ్న అందరిలో మొదలైంది.

మూడేళ్ల కిందట నిఖిల్, సుధీర్ వర్మ కలిసి ఓ సినిమా ప్రారంభించారు. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా కరోనా పాండమిక్ టైంలో షూటింగ్ స్టార్ట్ చేసారు. ఫారిన్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకొని, చాలా సైలెంట్ చిత్రీకరణ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వివరాలేవీ బయటకు వెల్లడించలేదు. అయితే ఇన్నాళ్లకు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ పూర్తి చేసి, అదే చిత్రాన్ని 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే పేరుతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని తెలుస్తోంది.

‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. రెండు పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలు చేస్తున్నప్పుడు, మధ్యలో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రాన్ని తీసుకురావడం హీరోకి ఇబ్బందిగా మారుతుందేమో అనే మాటలు సినీ వర్గాల్లో వినిపించాయి. దీనికి తోడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు నిఖిల్ సైలెంట్ గా ఉన్నాడు. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడేమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే నిఖిల్ ఈ మూవీ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదొక ప్రయోగాత్మక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని అభివర్ణించాడు.

సుధీర్ వ‌ర్మ‌ - నిఖిల్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'స్వామిరారా', 'కేశవ' సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మంచి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది హిట్టయితే నిఖిల్ తో పాటుగా సుధీర్ వర్మ కెరీర్ కు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఇటీవల రిలీజైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిఖిల్ లుక్ కూడా బాగుంది. రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ అందంగా కనిపించారు. సుధీర్ వర్మ మార్క్ స్క్రీన్ ప్లేలో సస్పెన్స్, మిస్టరీ, యాక్షన్.. అన్ని అంశాలు ఉన్నాయనే విషయాన్ని టీజర్ లో చూపించారు. మరి ఈ చిత్రాన్ని జనాలను మరింత చేరువ చెయ్యడానికి రాబోయే రోజుల్లో మేకర్స్ ఏ మేరకు ప్రమోషన్స్ చేస్తారో? ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.