Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హీరోయిన్ ఆస్తులు 100కోట్లు?

ఈ రోజు బాలీవుడ్‌లో పాపుల‌ర్ హీరోయిన్ గానే కాకుండా విలాసవంతమైన జీవనశైలిని కూడా గడుపుతున్న జాన్వీ కపూర్ గురించే ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్.

By:  Tupaki Desk   |   21 Jun 2024 4:16 AM GMT
ఎన్టీఆర్ హీరోయిన్ ఆస్తులు 100కోట్లు?
X

ముంబైలో రూ.65 కోట్ల‌ ఇల్లు... చెన్నైలో హాలిడే హోమ్.. రూ. కోటి వ్యానిటీ వ్యాన్.. నికర ఆస్తుల విలువ సుమారు 100 కోట్లు.. కేవ‌లం సినీరంగంలో ప్ర‌వేశించిన ఆరేళ్లలో యువ‌న‌టి ఆదాయ ఆర్జ‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ ఎవ‌రా యంగ్ బ్యూటీ? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఈ రోజుల్లో చాలా మంది నటీన‌టులు సినిమాల్లో పనిచేయడమే కాకుండా.. ఇత‌ర వ్యాపారాల్లో కష్టపడి సంపాదించిన డబ్బుతో తమ కోసం విలాసవంతమైన జీవనశైలిని నిర్మించుకోవడానికి కూడా కృషి చేస్తున్నారు. ఈ రోజు బాలీవుడ్‌లో పాపుల‌ర్ హీరోయిన్ గానే కాకుండా విలాసవంతమైన జీవనశైలిని కూడా గడుపుతున్న జాన్వీ కపూర్ గురించే ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్. జాన్వీ ఎవ‌రో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి- బోనీ కపూర్ ల పెద్ద కుమార్తె. జాన్వీ కపూర్ 2018 సంవత్సరంలో `ధడక్` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నేడు జాన్వీ కపూర్ నికర ఆస్తి విలువ రూ. 82 కోట్లు. ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 5-10 కోట్లు వసూలు చేస్తోంది. అయితే జాన్వీ ఇటీవ‌ల వ‌రుస‌గా తెలుగు సినిమాల్లో న‌టిస్తోంది. ఎన్టీఆర్ తో దేవ‌ర‌, రామ్ చ‌ర‌ణ్ తో బుచ్చిబాబు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. త‌దుప‌రి దేవ‌ర 2లోను న‌టించ‌నుంది. వీట‌న్నిటి కోసం జాన్వీ కోట్ల‌లో పారితోషికాలు అందుకుంటోంది. ఈ స్పీడ్ చూస్తుంటే జాన్వీ క‌పూర్ ఆస్తులు 2025 నాటికి 100 కోట్ల క్ల‌బ్ ని చేరుకోవ‌చ్చ‌ని అంచ‌నా.

ఇటీవలే దర్శకుడు శరణ్ శర్మ `మిస్టర్ అండ్ మిసెస్ మహి` సినిమాలో జాన్వీ కపూర్ కనిపించింది. ఈ సినిమా కోసం 5కోట్ల పారితోషికం అందుకుంది. జాన్వీ కపూర్ తన తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి ముంబైలోని బాంద్రాలోని పాష్ ఏరియా పాలి హిల్‌లో నివసిస్తున్నారు. జాన్వీ-ఖుషి క‌లిసి బెలిస్క్ బిల్డింగ్‌లో ఈ విలాసవంతమైన డ్యూప్లెక్స్‌ను కొనుగోలు చేశారు. ఈ డ్యూప్లెక్స్ ధర రూ.65 కోట్లు.

ఇక ఇంటీరియ‌ర్ ప‌రంగా ఇంటి లోపలి భాగాన్ని సరళంగా ఉంచారు. డ్యూప్లెక్స్‌ను అలంకరించడానికి చాలా కళాఖండాలు ఉపయోగించారు. జాన్వీ కపూర్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్న ఆర్ట్‌వర్క్, పెయింటింగ్స్ అన్నీ తన తల్లి శ్రీదేవి ఎంపిక చేసుకున్నవేన‌ని తెలిపారు. ఈ డ్యూప్లెక్స్‌లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ఓపెన్ కిచెన్, బార్ ఏరియాతో కూడిన పెద్ద ఓపెన్ గార్డెన్ ఉంది. ఇక్కడ కపూర్ కుటుంబం పార్టీల‌కు ఇష్టపడుతుంది.

జాన్వీ కపూర్ చెన్నైలోని 1.5 ఎకరాల స్థలంలో నిర్మించిన ఇంటిని దివంగత శ్రీదేవి తన సూపర్‌హిట్ చిత్రం `చాందిని` సంపాదన తో కొనుగోలు చేసింది. ఇంటి లోపలి భాగం క్లాసీగా ఉంటుంది. ఇంటి మొత్తానికి వుడెన్ ఫ్లోరింగ్ చేశారు. ఇంటికి రాచరికపు రూపాన్ని ఇవ్వడానికి దిగుమతి చేసుకున్న ఫర్నిచర్ .. కళాత్మక చెక్క‌ల‌తో అలంకరించారు. డైనింగ్ ఏరియాలో మార్బుల్ టేబుల్ చెక్క కుర్చీ ఉంచారు. ఈ ఇంటిని కళాకృతులు, పెయింటింగ్‌లతో కూడా అలంకరించారు.

జాన్వీ కపూర్ తన పెంపుడు జంతువుల కోసం ప్లే రూమ్‌ను నిర్మించింది. ఆమెకు 5 రకాల జాతుల కుక్కలు ఉన్నాయి. జాన్వీ దగ్గర 2.5 లక్షల విలువైన అమెరికన్ అకిటా జాతి కుక్క ఉంది. ఆమె వద్ద హవానీస్ జాతి కుక్క కూడా ఉంది. ఈ కుక్క‌ల‌ ప్రారంభ ధర లక్ష రూపాయలు. ఇది కాకుండా జాన్వీ వద్ద రూ. 25000-35000 విలువైన యార్క్‌షైర్ టెర్రియర్ కుక్క .. రూ. 15000-30000 విలువైన గోల్డెన్ రిట్రీవర్ కుక్క కూడా ఉన్నాయి. జాన్వీ దగ్గర లాబ్రడార్ జాతి పెంపుడు కుక్క కూడా ఉంది. దీని ధర రూ. 10000-20000.

విలాసవంతమైన కార్లు

బాలీవుడ్‌లో మెర్సిడెస్ మేబ్యాక్‌ను కలిగి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తులలో జాన్వీ కపూర్ ఒకరు. భారత మార్కెట్లో ఈ విలాసవంతమైన సెడాన్ ధర దాదాపు రూ.1.94 కోట్లు. ఆమె దగ్గర దాదాపు రూ.95 లక్షల విలువైన BMW X5 కూడా ఉంది. రూ. 2.7 కోట్ల విలువైన లెక్సస్ ఎల్‌ఎక్స్ 570, రూ. 1.62 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, దాదాపు రూ. 67 లక్షల విలువైన మెర్సిడెస్ జిఎల్‌ఇ 250 డి కూడా జాన్వీ ఇంటి గ్యారేజీలో కొలువు దీరి ఉన్నాయి.

న‌చ్చే హాలీడే స్పాట్స్:

జాన్వీ కపూర్ మాల్దీవుల్లో సెలవులు గడపడానికి ఇష్టపడుతుంది. మాల్దీవుల సోనేవా జానీ రిసార్ట్‌లో సెల‌వుల‌ను గడుపుతుంది. ఇది మాల్దీవులలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన రిసార్ట్‌లలో ఒకటి. ఈ రిసార్ట్‌లో ఒక రాత్రి బసకు అద్దె రూ. 1.6 ల‌క్ష‌ల నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుంది. ఇక్కడ ప్రెసిడెన్షియల్ సూట్‌లో ఒకరోజు బస ధర రూ.14 లక్షలు.

సొంతంగా వ్యానిటీ వ్యాన్

మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. జాన్వీ కపూర్ వానిటీ వ్యాన్ బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన వానిటీలలో ఒకటి. GQ ఇండియా వివ‌రాల‌ ప్రకారం..ఈ లగ్జరీ వ్యానిటీ కోసం 1 కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఈ వ్యానిటీలో దాదాపు రూ. 6 లక్షల ఖరీదు చేసే పైలేట్స్ మెషిన్ కూడా ఉంది. భార‌త‌దేశంలోని రిచెస్ట్ కిడ్స్ లో ఒక‌రిగా జాన్వీ క‌పూర్ ఏల్తోంది. సినిమాలు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, రియ‌ల్ ఎస్టేట్, సోష‌ల్ మీడియా ఆదాయాల‌తో జాన్వీ వేగంగా ఆర్జిస్తున్న నాయిక‌గా వెలిగిపోతోంది.