Begin typing your search above and press return to search.

విజయ్ తో ఆ బిగ్ మూవీ ఏమైనట్లు?

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. గత కొంత కాలంగా పోటీ పడుతున్నాయి

By:  Tupaki Desk   |   2 April 2024 12:30 AM GMT
విజయ్ తో ఆ బిగ్ మూవీ ఏమైనట్లు?
X

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. గత కొంత కాలంగా పోటీ పడుతున్నాయి. మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థలు మాట్లాడుకుని అప్పట్లో ఓ భారీ ప్రాజెక్ట్ ను చేతులు మార్చుకున్నాయి. అలా స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినిమా దిల్ రాజు చేతుల్లోకి వచ్చింది. అదే ఫ్యామిలీ స్టార్ అని అనుకున్నారా ఏంటి? కాదు కాదు అది వేరు ఇది వేరు.

అసలు రెండు సంస్థలు చేతులు మార్చుకున్న సినిమా జాడే లేదు. ఇంతలో తనకు గీత గోవిందంతో సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్ పెట్లతో ఫ్యామిలీ స్టార్ మూవీ కంప్లీట్ చేశారు విజయ్ దేవరకొండ. ఈ మూవీని కూడా దిల్ రాజే నిర్మించడం విశేషం. టాలెంటెడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. వేసవి కానుకగా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మైత్రీ సంస్థ నుంచి దిల్ రాజు చేతికొచ్చిన ప్రాజెక్ట్ గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ.. ఆ సినిమా అలాగే ఉందని చెప్పారు దిల్ రాజు. అదొక పాన్ ఇండియా మూవీ, ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిందని వెల్లడించారు. ఎప్పటికైనా తానే ఆ సినిమాను తెరకెక్కిస్తానని క్లారిటీ ఇచ్చారు. అందుకు సరైన సమయం రావాలని, ప్రొడ్యూసర్ గా తాను కూడా టైమ్ కేటాయించాలని తెలిపారు.

అయితే తన కెరీర్ లో బొమ్మరిల్లు నుంచి బలగం మూవీ వరకు ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి మాత్రమే అంచనా తప్పిందని అన్నారు. నితిన్, రాశీఖన్నా జంటగా చేసిన శ్రీనివాస కళ్యాణంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, శతమానం భవతిలా సూపర్ హిట్ అవుద్దని అనుకున్నట్లు తెలిపారు. కానీ సీన్ అంతా రివర్స్ అయిందని, అంచనాలు తప్పాయని చెప్పారు.

ఇక కరోనా టైమ్ లో విజయ్ డబ్బులు అడిగితే అడ్వాన్స్ పంపానని తెలిపారు దిల్ రాజు. అలా పంపడం తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ అని చెప్పారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని హామీ ఇస్తున్నారు దిల్ రాజు. మరి ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.