Begin typing your search above and press return to search.

బేబీ కాపీనా.. దర్శకుడి​ ఓపెన్​ ట్విస్ట్​​

అసలేం జరిగిందంటే.. 'బేబి' చిత్రాన్ని తన స్టోరీని దొంగిలించి సినిమా తీశారంటూ దినేశ్ కుమార్ డీకే అనే వ్యక్తి సోషల్​మీడియాలో ట్వీట్ చేశారు

By:  Tupaki Desk   |   29 July 2023 5:20 AM GMT
బేబీ కాపీనా.. దర్శకుడి​ ఓపెన్​ ట్విస్ట్​​
X

ఈ మధ్య టాలీవుడ్​ ఇండస్ట్రీలో భారీ సెన్సేషన్​గా నిలిచిన సినిమా 'బేబీ'. చిన్న సినిమాగా రిలీజై​ కల్ట్ క్లాసిక్ హిట్​గా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రెండు వారాల్లోనే దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ వరకు అందుకుని సినీ విశ్లేషకులను షాక్​కు గురి చేసింది. ఆఖరికి వీక్ డేస్‌లోనూ హౌస్ ఫుల్స్‌తో నడుస్తూ సెన్సేషనల్​ క్రియేట్ చేసింది.

అయితే ఇప్పుడీ సినిమా కాపీ అంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా కాపీ అంటూ ప్రేక్షకులకు చెప్పింది చిత్ర దర్శకుడు సాయి రాజేషే కావడం గమనార్హం.

అసలేం జరిగిందంటే.. 'బేబి' చిత్రాన్ని తన స్టోరీని దొంగిలించి సినిమా తీశారంటూ దినేశ్ కుమార్ డీకే అనే వ్యక్తి సోషల్​మీడియాలో ట్వీట్ చేశారు. బేబీ మూవీ కాపీ అంటూ రాసుకొచ్చారు. 2012లోనే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు,ప్రేమకథ ఆధారంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్క్రిప్ట్​ను రాయడం మొదలుప్టటినట్టు తెలిపిన డీకే.. 2018లో ఫుల్​ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలిపారు.

ఆ తర్వాత పలు భాషల్లోని నిర్మాతలను కలిసి కథ కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే కొందరికి స్క్రిప్ట్​ను కూడా ఇచ్చారట. కానీ ఇప్పుడు టాలీవుడ్​లో ఆ కథతోనే సినిమా తీశారని ఆరోపించాడు.

అయితే ఈ పోస్ట్​ను ఒక తమిళ క్రిటిక్ షేర్ చేశారు. దాన్ని స్క్రీన్​ షాట్​ తీసిన దర్శకుడు సాయి రాజేశ్.. తన సోషల్​మీడియా అకౌంట్ ద్వారా దీన్ని పంచుకున్నారు. అలాగే కొన్ని మీడియా సంస్థలకు కూడా ట్యాగ్ చేసి దీని మీద వార్తలు రాయడం అంటూ సూచనలు చేశారు.

కాగా, చిత్రసీమలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. పలు హిట్​ సినిమాల విషయంలో ఇలాంటి ఆరపణలు వస్తూనే ఉంటాయి. కొంతమంది కావాలని ట్రెండ్​ అవ్వాలని ఇలా చేస్తుంటారు. మరి కొన్ని సందర్భాల్లో కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే.. బేబీ దర్శకుడు సాయి రాజేశ్​.. ఈ సినిమా తమిళనాడులోని సేలంలో జరిగిన ఒక ఉదంతం స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించినట్లు ఇప్పటికే తెలిపారు.