Begin typing your search above and press return to search.

రాజమౌళి విజన్ పై డాక్యుమెంటరీ… రిలీజ్ ఎప్పుడంటే?

అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి.

By:  Tupaki Desk   |   6 July 2024 5:34 AM GMT
రాజమౌళి విజన్ పై డాక్యుమెంటరీ… రిలీజ్ ఎప్పుడంటే?
X

అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఆయన కెరియర్ లో చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయినవే కావడం విశేషం. ఇంటరెస్టింగ్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల హృదయాల్ని కట్టిపడేసే ఎలిమెంట్స్ రాజమౌళి సినిమాలలో ఉంటాయి. అందుకే ఎవ్వరికి లేనంత ఆదరణ, బ్రాండ్ రాజమౌళికి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకుల నుంచి రాజమౌళి ప్రశంసలు అందుకున్నారు.

ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి ఇప్పుడు తన ఇమేజ్ ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఇదిలా ఉంటే రాజమౌళి మేకింగ్ స్టైల్, విజన్, తెరవెనుక మూవీ కోసం ఆయన ఎలాంటి ఎఫర్ట్స్ పెడతాడు అనే ఇంటరెస్టింగ్ విషయాలతో ఒక డాక్యుమెంటరీ రెడీ అవుతోంది. పాపులర్ జర్నలిస్ట్ అనుపమ చోప్రా ఈ డాక్యుమెంటరీని తెరకెక్కిస్తున్నారు.

మోడ్రన్ మాస్టర్ పేరుతో ఈ డాక్యుమెంటరీని రెడీ చేస్తున్నారంట. రాజమౌళి సినిమా మేకింగ్ విజువల్స్ కూడా ఈ డాక్యుమెంటరీలో ఉంటాయంట. ఇండియన్ సినిమా గమనాన్ని రాజమౌళి విజన్ మార్చేసిందని అనుపమ చోప్రా ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆయన గురించి సినిమా రంగంలోకి వచ్చే ప్రతి టెక్నీషియన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే మోడ్రన్ మాస్టర్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ డాక్యుమెంటరీ ఆగష్టు 2న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుందంట.

దీనిలో ఆర్ఆర్ఆర్, బాహుబలి మూవీ మేకింగ్ విజువల్స్ తో పాటు ఆ సినిమా స్క్రిప్ట్ ఆలోచన నుంచి వాటిని సినిమాగా రూపొందించడం వరకు అన్ని ఎలిమెంట్స్ కి కవర్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీతో రాజమౌళి విజన్, ఎఫర్ట్స్ ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మరి వాటిని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారు అనేది చూడాలి.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ప్రస్తుతం లుక్ టెస్ట్ చేస్తున్నారంట. ఈ ఏడాది ఆఖరులో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ కి ప్రతినాయకుడిగా మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ని ఎంపిక చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.