Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ క్లాష్ లో గ్లామర్ ఫైట్

ఈ నెలలో రెండు మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి

By:  Tupaki Desk   |   8 Aug 2024 10:12 AM GMT
బాక్సాఫీస్ క్లాష్ లో గ్లామర్ ఫైట్
X

ఈ నెలలో రెండు మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఆగష్టు 15న మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ తో సత్తా చూపించడానికి రెడీ అయ్యాడు. మరో వైపు ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ కొట్టిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తో డబుల్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నారు. ఈ రెండు సినిమాలపైన కూడా యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే ఈ రెండు చిత్రాలని తెరకెక్కించింది కమర్షియల్ డైరెక్టర్స్ గా మంచి పేరున్న పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ కావడం విశేషం.

ఇందులో మరో విశేషమేంటంటే హీరో క్యారెక్టరైజేషన్స్ పరంగా హరీష్ శంకర్ పైన పూరి జగన్నాథ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు ఆర్జీవీ దగ్గర వర్క్ చేసినవారే. ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. పూరి జగన్నాథ్ సినిమాలతోనే మాస్ మహారాజ్ రవితేజ స్టార్ హీరోగా టాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యాడు. అందుకే ఇప్పుడు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల మధ్య ఫైట్ ని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ రెండింటిలో విన్నర్ ఎవరవుతారా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంది.

రెండు సినిమాలపైన భారీగానే బిజినెస్ జరిగింది. అలాగే ఎక్స్ పెక్టేషన్స్ కూడా హెవీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలకి సంబందించి మరో ఇంటరెస్టింగ్ ఫైట్ ని కూడా ప్రేక్షకులు చూడబోతున్నారు. అది డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ కావ్య థాపర్, మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే మధ్య. భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ తో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. మొదటి చిత్రంతోనే గ్లామర్ తో పాటు డాన్స్ పరంగా భాగ్యశ్రీ కుర్రకారు హృదయాలని గెలుచుకుంది.

హరీష్ శంకర్ భాగ్యశ్రీ అందాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే మరో రెండు ఛాన్స్ లు భాగ్యశ్రీ అందుకుంది. మిస్టర్ బచ్చన్ లో ఆమె పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటే నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక కావ్యా థాపర్ ఈ మాయ పేరేమిటో సినిమాతో 2018లోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత సంతోష్ శోభన్ కి జోడీగా ఏక్ మినీ కథ మూవీతో సక్సెస్ అందుకుంది.

రవితేజ ఈగల్, సందీప్ కిషన్ ఊరుపేరు భైరవకోన సినిమాలలో కావ్య థాపర్ నటించింది. ఈ సినిమాలలో ఆమె నటిగా పర్వాలేదనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్ లు అందుకోలేదు. ఇప్పటి వరకు ఎవరు కూడా కావ్య థాపర్ ని గ్లామరస్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. పూరి జగన్నాథ్ మాత్రం డబుల్ ఇస్మార్ట్ లో కావ్య థాపర్ ను తెరపై చాలా అందంగా ఆవిష్కరించారు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ సాంగ్స్ అండ్ ట్రైలర్ లో హాట్ అండ్ బోల్డ్ షో తో కావ్య థాపర్ అందరిని మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ సక్సెస్ అయితే నెక్స్ట్ టాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా కావ్య థాపర్ మారే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు భామలతో ఎవరు ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసి ఆగష్టు 15 విన్నర్ గా నిలుస్తారనేది వేచి చూడాలి.