Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. ఓవర్సీస్ లో రిలీజ్ చేసేది వీళ్ళే..

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్సెస్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.

By:  Tupaki Desk   |   23 July 2024 10:10 AM GMT
డబుల్ ఇస్మార్ట్.. ఓవర్సీస్ లో రిలీజ్ చేసేది వీళ్ళే..
X

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రూపొందిన డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్సెస్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.

ఇప్పటికే ఈ మూవీని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో కూడా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అందుకు మేకర్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత నిరంజన్ రెడ్డి దక్కించుకున్నారు. నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ ప్రాతిపాదికన హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవల ఓవర్సీస్ రైట్స్ డీల్ ను కూడా పూర్తి చేశారు డబుల్ ఇస్మార్ట్ మేకర్స్. ఓవర్సీస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ అయిన నిర్వాణ సినిమాస్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు హక్కులను సంయుక్తంగా సొంతం చేసుకున్నాయి. పెద్ద ఎత్తున ఓవర్సీస్ లో రిలీజ్ చేయనున్నాయి.

డబుల్ ఇస్మార్ట్ లో యాక్షన్, మాస్, ఎంటర్టైన్మెంట్ అన్నీ డబుల్ ఉంటాయని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. సాంగ్స్, టీజర్ సహా ప్రమోషనల్ కంటెంట్ అంతా డబుల్ రేంజ్ లోనే ఉంది. ఇక ఇస్మార్ట్ శంకర్ మూవీ ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. రామ్ సరసన కావ్య థాపర్ కథానాయికగా సందడి చేయనుంది. త్వరలో మేకర్స్ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. లైగర్ తర్వాత చేసిన ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని చూస్తున్నారు పూరీ. రామ్ కూడా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.