Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ వచ్చేది అప్పుడే.. ఆ పెద్ద సినిమా లేనట్లే..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుని మూవీపై హైప్ క్రియేట్ చేశాయి.

By:  Tupaki Desk   |   15 Jun 2024 1:21 PM GMT
డబుల్ ఇస్మార్ట్ వచ్చేది అప్పుడే.. ఆ పెద్ద సినిమా లేనట్లే..
X

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అయిదేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుని మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్‌ ను కంటిన్యూ చేస్తూ పూరి ఈ సినిమా తీస్తున్నట్లు టీజర్ చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. అంతే కాదు.. సీక్వెల్ లో టైటిల్ కు తగ్గట్లు యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ డబుల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాంగ్స్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ సడెన్ గా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు పవర్ ఫుల్ పోస్టర్ ను షేర్ చేశారు. అందులో రామ్ వేరే లెవల్ లో ఉన్నారు. విభూతి పెట్టుకుని పవర్ ప్యాక్డ్ లుక్ లో కనిపించారు.

పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో శివలింగంతో పాటు ఇంట్రెస్టింగ్ జ్వాలా ఫలకాన్ని చూపించారు మేకర్స్. అయితే టీజర్ లో కూడా శివుడి రిఫరెన్స్ తో రామ్ డివోషనల్ గా కనిపించారు. దీంతో ఈ చిత్రం క్లెమాక్స్ అదిరిపోయేలా ఉండనుందని టాక్. మొత్తానికి పోస్టర్ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో అలీ, గెటప్ శ్రీను, షిండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సీక్వెల్ కు కూడా మణిశర్మ సాలిడ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే రామ్ ఫ్యాన్స్ ఇప్పుడు రిలీజ్ డేట్ అప్డేట్ తో హ్యాపీగా ఉన్నా.. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. ఇప్పటికే పుష్ప -2 పోస్ట్ పోన్ అవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మేకర్స్ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. ఇంతలో డబుల్ ఇస్మార్ట్.. ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల సుకుమార్ విడుదల వాయిదా వేస్తారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. పుష్ప 2 పోస్ట్ పోన్ అవుద్దని తెలిసి.. పూరి ఆ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది.