Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ హిందీ రైట్స్ కూడా అతనికే!

పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కి ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్.

By:  Tupaki Desk   |   22 July 2024 4:31 AM GMT
డబుల్ ఇస్మార్ట్ హిందీ రైట్స్ కూడా అతనికే!
X

పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కి ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పూరి జగన్నాథ్ అప్పుడే ప్రకటించాడు. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని లైగర్ సినిమాని పూరి జగన్నాథ్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. లైగర్ ఫ్లాప్ ఎఫెక్ట్ నుంచి కోలుకొని డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు.

ఈ సినిమాతో పూరి బౌన్స్ బ్యాక్ అవుతారని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు. రామ్ పోతినేని కూడా వరుస డిజాస్టర్ లకి డబుల్ ఇస్మార్ట్ తో ఫుల్ స్టాప్ పెడతాడనే మాట వినిపిస్తోంది. ఏకంగా ఐదు భాషలలో డబుల్ ఇస్మార్ట్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా లాంగ్ వీకెండ్ ని ఉపయోగించుకుంటుందని అంచనా వేస్తున్నారు.

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మికౌర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమాని నిర్మించారు. ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. అన్ని భాషలకి సంబందించిన రైట్స్ ని హోల్ అండ్ సోల్ గా నిరంజన్ రెడ్డి భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్నారంట. డిజిటల్ రైట్స్ ద్వారా కూడా పూరికి డబుల్ ఇస్మార్ట్ తో బాగానే గిట్టుబాటు అయినట్లు తెలుస్తోంది.

హిందీలో ఈ మూవీ రైట్స్ ని నిరంజన్ రెడ్డి సొంతం చేసుకోవడంతో పాటు ఆయనే రిలీజ్ చేస్తున్నారంట. సినిమా లాభం వచ్చిన, నష్టం వచ్చిన దానిని పూర్తిగా అతనే భరించడానికి రెడీ అయినట్లే, లైగర్ తో ఆర్ధికంగా నష్టపోయిన పూరి జగన్నాథ్ టీమ్ కి డబుల్ ఇస్మార్ట్ కొంత సేఫ్ చేసిందని అర్ధమవుతోంది. అలాగే సినిమాపై పాజిటివ్ బజ్ అయితే పెరుగుతోంది.

మూవీ సూపర్ హిట్ అయితే మాత్రం కచ్చితంగా పూరి జగన్నాథ్ మరల బౌన్స్ బ్యాక్ అయ్యి స్పీడ్ గా సినిమాలు చేయడంపై దృష్టి పెడతాడు. అలాగే తనకి అలవాటైన జోనర్ లోనే మరింత అడ్వాన్స్ మోడ్ లో కథలు రాసుకొని ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్లింగ్ అందించాలని అనుకుంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ హిట్ అయితే బాలయ్యతో పైసా వసూల్ సీక్వెల్ ని కూడా పూరి జగన్నాథ్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.