Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్ అటకెక్కినట్టేనా..?

బడ్జెట్ ఎక్కువైన ప్రతి సినిమా ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కించడం ట్రెండ్ గా మారింది

By:  Tupaki Desk   |   21 May 2024 5:33 AM GMT
ఆ సీక్వెల్ అటకెక్కినట్టేనా..?
X

బడ్జెట్ ఎక్కువైన ప్రతి సినిమా ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కించడం ట్రెండ్ గా మారింది. కథను ఒక సినిమాగా చెప్పలేం అనుకున్నప్పుడు రెండు భాగాలుగా చెప్పొచ్చు.. ఆడియన్స్ లో ఆ ఎగ్జైట్ మెంట్ కొనసాగించ వచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి కూడా ఆ ప్రాజెక్ట్ ని ఒక సినిమాగానే చేయాలని అనుకున్నాడు. కానీ పాత్రలు బాగా వస్తుండటంతో ఆ కాన్ఫిడెన్స్ తో ఎవరు చేయలేని సాహసం చేశాడు. రాజమౌళి వేసిన ఆ ఒక్క అడుగు ఎన్నో సినిమాలకు స్పూర్తిగా నిలిచింది. ఎంతోమంది దర్శకులకు ధైర్యం ఇచ్చింది.

ఐతే అన్ని సినిమాలు ఇలా రెండు భాగాలుగా చెప్పాలనుకుంటే పొరపాటు చేసినట్టే. బాహుబలి సినిమాకు అలా కుదిరింది. ఆ తర్వాత వచ్చిన కె.జి.ఎఫ్ కూడా రెండు భాగాలు అలా వర్క్ అవుట్ అయ్యింది. మరోపక్క పుష్ప ని కూడా అలా రెండు భాగాలుగా తెస్తున్నారు. అయితే ఈ మధ్యలో కొన్ని సినిమాలు అలాంటి ప్రయత్నమే చేసినా అంతగా వర్క్ అవుట్ కాలేదు.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఈగల్. ఈ సినిమా రిలీజ్ ముందు ఒక భాగంగానే అనుకోగా సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. అసలు కథ సెకండ్ పార్ట్ లోనే అనిపించేలా చేశారు. అయితే ఈగల్ సినిమా సక్సెస్ అయితే ఈగల్ 2 చేసే అవకాశం ఉండేది. కానీ ఈగల్ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు ఈగల్ 2 చేసే ఛాన్స్ ఉందా అంటే కష్టమే అని అంటున్నారు. ఈగల్ 1 నే ఎవరు చూడలేదు. ఈగల్ 2 చేస్తే మాత్రం ఉపయోగం ఉంటుందా అని దర్శక నిర్మాతల్లో డౌట్ మొదలైంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈగల్ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టేశారు. ఈగల్ 2 కి సంబంధించిన కొంత రష్ ఉన్నా సీక్వెల్ చేయాలంటే మళ్లీ ఎంతోకొంత సెటప్ చేయాల్సి ఉంటుంది. అందుకే రవితేజతో ఈగల్ 2 చేయడం కన్నా దానికి బదులు మరో సినిమా చేయడం బెటర్ అనే ఆలోచన కూడా మంచిదని చెప్పొచ్చు. డైరెక్టర్ కార్తీక్ మాత్రం ఈగల్ ని వదిలి పెట్టి తేజా సజ్జాతో మిరాయ్ అంటూ వస్తున్నాడు. లేటెస్ట్ గా ఆ సినిమా నుంచి మంచు విష్ణు టీజర్ రిలీజ్ చేశారు. మిరాయ్ లో విలన్ గా మంచు విష్ణు అదరగొట్టనున్నాడని చెప్పొచ్చు.