Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ ను ఢీకొట్టాలంటే ఈమాత్రం ఉండాలి

ఇక ఫహాద్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన తాజా పోస్టర్ లో ఆయన ప్రతినాయకులకు భయపెట్టే రీతిలో కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 1:03 PM GMT
పుష్ప రాజ్ ను ఢీకొట్టాలంటే ఈమాత్రం ఉండాలి
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్పా: ది రూల్' పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేగ్ చేసింది. టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది.

ఇక సినిమాలో ప్రముఖ నటుడు ఫహాద్ ఫాసిల్ కీలకమైన పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షేకావత్ పాత్రలో కనిపించనున్నారు. సుకుమార్ రచనలో ఈసారి ఈ విలన్ మరింత పవర్ఫుల్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రపై ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది. ఫహాద్ ఫాసిల్ నటనకు మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో, ఈ సినిమాలో అతని పాత్ర మరింత మలుపులు తిరిగేలా ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ఫహాద్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన తాజా పోస్టర్ లో ఆయన ప్రతినాయకులకు భయపెట్టే రీతిలో కనిపిస్తున్నారు. ఒక చేతిలో గన్ను మరో చేతిలో గొడ్డలి పట్టుకొని ఉన్నాడు. ఈ పాత్ర మొదటి భాగంలో ఎంత విలక్షణంగా ఉందో, రెండవ భాగంలో కూడా అంతే డైనమిక్ గా ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి. సుకుమార్, ఫహాద్ పాత్రను చాలా ఊహించలేని సన్నివేశాలతో నిండింపచేస్తున్నారని సమాచారం.

ఫహాద్ ఫాసిల్ తనదైన శైలిలో పాత్రను పోషించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అనుమానమే లేదు. ఇప్పటికే విడుదలైన 'పుష్పా పుష్పా' అనే మొదటి పాట అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా, రెండవ పాట 'సూసేకి' కూడా భారీ హిట్ గా నిలిచింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ జరుగుతోంది. ఈ క్లైమాక్స్ సీన్ సుకుమార్ విజన్ ని ప్రతిబింబిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 6 ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యున్నత ప్రమాణాలతో రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ మిరెస్లో కెుబా బ్రోజెక్ తన కెరీర్ లోనే అత్యుత్తమ పనితనాన్ని అందించనున్నారని తెలుస్తోంది. ఎస్ రామకృష్ణ, న మోనికా వంటి టెక్నీషియన్ల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఈ చిత్రంలో మరింత ప్రత్యేకతను కలిగించనుంది.