Begin typing your search above and press return to search.

ఆగిపోయిన మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలెక్కుతోంది!

తాజా స‌మాచారం మేర‌కు 'జీ లే జరా'ను ఫ‌ర్హాన్ పునరుద్ధరించనున్నార‌ని తెలిసింది.

By:  Tupaki Desk   |   26 May 2024 12:30 AM GMT
ఆగిపోయిన మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలెక్కుతోంది!
X

ప్ర‌స్తుతం డాన్ 3 చిత్రాన్ని నిర్మిస్తున్న ఫ‌ర్హాన్ అఖ్త‌ర్ చాలా కాలం క్రితం జీలే జ‌రా అనే భారీ మ‌ల్టీస్టార‌ర్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ సెట్స్ కెళ్ల‌క‌పోవ‌డంపై ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రినా కైఫ్ లాంటి క్రేజీ స్టార్ల‌తో జీ లే జరా ను 2021లో ప్రకటించారు. అయితే అప్పటి నుండి దాని నెక్ట్స్ స్టెప్ ఏమిట‌న్న‌దానిపై ఎటువంటి సమాచారం లేదు. స్లైస్-ఆఫ్-లైఫ్ రోడ్ ట్రిప్ ఫిల్మ్ కి ఫ‌ర్హాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. అయితే తార‌ల కాల్షీట్ల స‌మ‌స్య‌తో ఇది అటకెక్కింద‌ని కూడా ప్ర‌చారం సాగిపోయింది.

తాజా స‌మాచారం మేర‌కు 'జీ లే జరా'ను ఫ‌ర్హాన్ పునరుద్ధరించనున్నార‌ని తెలిసింది. జాతీయ మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ మీడియా ప్ర‌తినిథులు 'జీ లే జరా'ను పునఃప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని తెలిసింది. ప్రీ-ప్రొడక్షన్ దశకు వెళ్లడానికి ముందు జీ లే జరా బృందం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతోంది. నిర్మాతలకే కాదు.. రచయితలు దర్శకుల వరకు వాటాదారులంద‌రికీ ఇది పెట్ ప్రాజెక్ట్ అయినందున దీనిని విడిచిపెట్ట‌లేదు. స్టార్ల కాల్షీట్ల‌ సమస్యల కారణంగా ఈ చిత్రం ఇంత‌కాలం చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌లేదు. అలాగ‌ని పూర్తిగా నిలిపివేయ‌నూ లేదు. స్క్రిప్ట్ ప్ర‌స్తుతం అభివృద్ధి ద‌శ‌లో ఉంది. చిత్ర‌ బృందం ఇప్పుడు ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించాలని చూస్తోంది.. అని ఒక సోర్స్ రివీల్ చేస్తోంది.

ప్రియాంక చోప్రా ఇటీవ‌లి భారతదేశ పర్యటన సందర్భంగా 'జీ లే జరా' గురించి ప్ర‌స్థావించారు. తాను పునఃప్రారంభించేందుకు ఫర్హాన్ అక్తర్ ను క‌లిసాన‌ని ప్రియాంక చోప్రా తెలిపారు.. అతడు కత్రినా కైఫ్, అలియా భట్‌లతో కూడా టచ్‌లో ఉన్నాడు. సినిమాను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావాలనే సానుకూల ఉద్దేశ్యంతో ముగ్గురి కాంబినేషన్ డేట్స్‌పై కసరత్తు చేస్తున్నారు.