Begin typing your search above and press return to search.

ఫ్రీ పబ్లిసిటీ.. భలే క్యాచ్ చేశాడు

అయితే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవ్వడంతో ఆమె వద్ద భోజనం చేసేందుకు వచ్చే ప్రజల సంఖ్య బాగా ఎక్కువైంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:49 AM GMT
ఫ్రీ పబ్లిసిటీ.. భలే క్యాచ్ చేశాడు
X

సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో చెప్పలేం. అలా ఈ మధ్య హైదరాబాద్‌ ఐటీసీ కొహినూర్ ఎదురుగా రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేసుకునే కుమారి అనే మహిళ చాలా ఫేమస్ అయిపోయింది. రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో ఎక్కడ చూసినా ఆమెనే కనిపించింది. గత కొన్నేళ్ల నుంచి ఈమె షాప్‌ నడిపిస్తూ జీవనం సాగిస్తోంది.


అయితే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవ్వడంతో ఆమె వద్ద భోజనం చేసేందుకు వచ్చే ప్రజల సంఖ్య బాగా ఎక్కువైంది. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిందని చెబుతూ కుమారి ఆంటీ స్టాల్ ను రెండు రోజుల క్రితం మూయించారు పోలీసులు. ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. అక్కడే కుమారి ఆంటీ స్టాల్ నిర్వహించుకునేలా అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే.. కుమారి ఆంటీ వ్యవహారంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించినా సెలబ్రిటీల్లో మాత్రం ఒక్క హీరో సందీప్ కిషనే మాత్రమే రియాక్ట్ అయ్యారు. స్టాల్ మూసిన తర్వాత.. “గత కొన్నేళ్లలో నేను చుసిన మహిళా వ్యాపారుల్లో ఈమె కూడా ఒకరు. సొంతంగా బిజినెస్ నడుపుతూ తన కుటుంబానికి సపోర్ట్ గా నిలిస్తున్న కుమారి ఆంటీ ఎంతో మంది మహిళలకు ఆదర్శం. ఆమె పట్ల ఇలా చేయడం న్యాయం కాదు. నేను, మా టీం ఆమె చేయనంత సాయం చేస్తాం” అంటూ ట్వీట్ చేశారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాక మరోసారి ట్వీట్ చేశారు సందీప్. “రేవంత్ గారిపై మరింత గౌరవం పెరిగింది. అభ్యర్థించిన కొంత సమయంలోనే చిరు వ్యాపారి అయిన సాయి కుమారికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు సర్. ఈ నిర్ణయం పెద్ద కలలు కనే మహిళలకు సరైన ఉదాహరణగా నిలుస్తుంది” అని రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ తెలిపారు. ఇప్పుడు కుమారి ఆంటీ వ్యవహారంపై సందీప్ కిషన్ తీసుకున్న చొరవ పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

అయితే సందీప్ కిషన్.. తన లేటెస్ట్ సినిమా ఊరు పేరు భైరవకోన ముందు ఈ పబ్లిసిటీని మానవత్వంతో ఫ్రీగా క్యాచ్ చేశారని సినీ పండితులు అంటున్నారు. తన గొప్ప మనసును సందీప్ కిషన్ చాటుకున్నారని చెబుతున్నారు. కాగా, ఇటీవలే సందీప్ తన మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా కుమారి ఆంటీ వద్దకు వెళ్లారు. సందీప్ తో పాటు హీరోయిన్స్ కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కూడా కుమారి ఆంటీ దగ్గర భోజనం చేశారు. ఫ్యాన్స్ తో ముచ్చటించారు.

సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 9నే రావాల్సిన ఈ మూవీ.. ఈగల్ కోసం వారం ఆలస్యంగా వస్తోంది. సూపర్ నాచురల్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీగా ఊరు పేరు భైరవ కోనను దర్శకుడు వీ ఆనంద్ తెరకెక్కించారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.