Begin typing your search above and press return to search.

'గాండీవధారి అర్జున' ట్రైలర్‌- వరుణ్ తేజ్ ఫుల్ యాక్షన్ మోడ్

డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు

By:  Tupaki Desk   |   10 Aug 2023 11:45 AM GMT
గాండీవధారి అర్జున ట్రైలర్‌- వరుణ్ తేజ్ ఫుల్ యాక్షన్ మోడ్
X

డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. చివరగా ఎఫ్3 సినిమాతో హిట్ అందుకున్న ఆయన వరసగా సినిమాలను లైన్​లో పెడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడింది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో ప్రమోషన్స్​లో జోరు పెంచిన మూవీటీమ్​.. రీసెంట్​గా ఓ చిన్న టీజర్ గ్లింప్స్​ను విడుదల చేయగా అది బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ట్రైలర్​ను విడుదల చేసింది. "డిసెంబర్​ 2020లో దేవుడు మీద మనిషి గెలిచాడట. జ‌స్ట్ పాతికవేల సంవ‌త్సరాల‌లో మ‌నిషి చేసిన వ‌స్తువులు దేవుడు చేసిన వాటిని మించేసాయంట. ఎలాగో తెలుసా..?" అంటూ నాజ‌ర్ సంభాషణలతో ట్రైల‌ర్ ప్రారంభమైంది.

ఈ క్రమంలోనే దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ పెద్ద సమస్య తలెత్తడం. 'ఏజెన్సీలో ఇంకెవరు లేరా?.. అనగానే.. 'ఏజెన్సీలో చాలా మంది ఉన్నారు. కానీ క్లైంట్​ కోసం బులెట్​ తీసుకునే వారు అర్జున్​ ఒక్కడే' అన్నప్పుడు వరుణ్​ తేజ్​ ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత ' క్లైంట్ అయినా సరే తప్పు చేస్తే చంపేస్తా..' అంటూ వరుణ్​ అనడం అంత స్పీడ్​ స్పీడ్​గా సాగిపోయింది.

ఫైనల్​గా 12 వేల మంది చనిపోయారంటూ.. దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ పెద్ద సమస్యను అర్జున్​ ఎలా పరిష్కరించాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేమిటి? ఇంతకీ అతడు చేపట్టిన ఆపరేషన్‌ వెనకున్న లక్ష్యమేమిటి? అనేది ట్రైలర్ ఆద్యంతం చూపించారు. వీటన్నింటికీ సమాధానాలు దొరకాలంటే తెరపై చూడాల్సిందే.

ఇక ఈ ప్రచార చిత్రంలో వరుణ్‌తేజ్ స్టెలిష్‌ లుక్స్‌ చాలా బాగున్నాయి. బాగా ఇంటెన్సివ్​గా యాక్ట్​ చేశారు. మొత్తంగా ఈ ట్రైలర్​ యాక్షన్‌ సన్నివేశాలతో ఉత్కంఠగా సాగింది. దర్శకుడు ప్రవీణ సత్తార్​ తన మార్క్​ టేకింగ్​ను అద్భుతంగా చూపించారు. చివరిగా వరుణ్​.. 'ప్రపంచానికి నిజం తెలియాలి?', నాజర్​.. 'భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్​ మనిషేనేమో' అంటూ ప్రచార చిత్రాన్ని మూగించారు. ఇక ఈ చిత్రంలో సాక్షివైద్య కథానాయికగా నటించింది.