Begin typing your search above and press return to search.

ఓటీటీలో విశ్వక్ మాస్ ట్రెండింగ్

ప్రత్యేకంగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రంలో లంకల రత్న పాత్రలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 7:52 AM GMT
ఓటీటీలో విశ్వక్ మాస్ ట్రెండింగ్
X

టాలీవుడ్ లో యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. రొటీన్ కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది 'గామి' మరియు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ నటుడిగా మరో స్థాయికి చేరుకున్నారు అని చెప్పవచ్చు. అలాగే ప్రస్తుతం వరుసగా మరిన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రత్యేకంగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రంలో లంకల రత్న పాత్రలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు.


'ఛల్ మెహన రంగ' ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూరల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో, స్థానిక రాజకీయాల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి రివ్యూలతో పాటు, బాక్సాఫీస్ మంచి వసూళ్లను రాబట్టింది. తన యాక్షన్, డైలాగ్ డెలివరీతో విశ్వక్ సేన్ ప్రేక్షకులను మెప్పించాడు.

ఇక 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ యాక్టింగ్‌ను ప్రశంసిస్తూ, సినిమాకు మంచి వ్యూస్ రావడంతో ఓటీటీలో కూడా మంచి సక్సెస్ అవుతోంది. ఇక ఇప్పుడు సినిమా ట్రేండింగ్ 2లో ఉండడం విశేషం.

బడా సినిమాకు ఎన్ని ఉన్నా విశ్వక్ స్టార్ స్టామినా ఓటీటీలో తగ్గట్లేదు అని చెప్పవచ్చు. సినిమాకు విశ్వక్ సేన్ తన మాస్ కా దాస్ ట్యాగ్‌కు సరిగ్గా న్యాయం చేశాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య మేకింగ్ పట్ల కూడా చాలా ప్రశంసలు అందుకుంటున్నాడు. మంచి కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, ప్రతీ అంశంలో తన వర్కింగ్ టాలెంట్‌ను చూపించాడు. మేకింగ్ విధానం ఆర్ట్ వర్క్ కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్.

సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. తెలుగు అమ్మాయి అంజలి లీడ్ రోల్ పోషించగా, నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ, మధుసూదన్, హైపర్ ఆది ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇక యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. పాటలు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. మొత్తానికి, విశ్వక్ సేన్ తన కెరీర్‌లో మరో లెవెల్ కు వెళుతూ మరిన్ని విజయాలను అందుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వంటి సినిమాలు, అతని నటనా ప్రతిభను మెరుగుపరుస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో విశ్వక్ మరిన్ని డిఫరెంట్ సినిమాలతో రానున్నట్లు తెలుస్తోంది.