Begin typing your search above and press return to search.

'వార్ 2' భార‌త‌దేశంలోనే బిగ్గెస్ట్ మూవీ

ఈ స్థాయిని ఇప్పుడే అందుకోవ‌డం హిందీ ప‌రిశ్ర‌మ‌కు అంత సులువేమీ కాద‌ని కూడా అన్నారు.

By:  Tupaki Desk   |   10 July 2024 4:12 PM GMT
వార్ 2 భార‌త‌దేశంలోనే బిగ్గెస్ట్ మూవీ
X

త‌మిళ అగ్ర నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా పాన్ ఇండియాలో నిరూపించుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ నిర్మించిన కంగువ (సూర్య‌)- తంగ‌లాన్ (విక్ర‌మ్) లాంటి భారీ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. త‌మిళ చిత్ర‌సీమ‌లోని అగ్ర హీరోల‌తో నిర్మించిన చిత్రాలివి. అయితే తాజాగా జ్ఞాన‌వేల్ రాజా ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ సినిమా ఇటీవ‌ల‌ ఎంతో అడ్వాన్స్ డ్ గా ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఈ స్థాయిని ఇప్పుడే అందుకోవ‌డం హిందీ ప‌రిశ్ర‌మ‌కు అంత సులువేమీ కాద‌ని కూడా అన్నారు.

అయితే బాలీవుడ్ లో రూపొందుతున్న వార్ 2 చిత్రం ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ అని వెల్ల‌డించారు. ఈ చిత్రంలో హృతిక్ - ఎన్టీఆర్ లాంటి విభిన్న ప‌రిశ్ర‌మ‌ల హీరోలు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వేర్వేరు ప‌రిశ్ర‌మ‌ల వ్య‌క్తులు ఏక‌మై సినిమాల‌కు పని చేస్తే ప్ర‌జ‌ల్లో ఉత్సాహం పెరుగుతుంద‌ని జ్ఞాన‌వేల్ అన్నారు. స్టార్ల‌ను చూసి ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు వ‌స్తున్నార‌ని అన్నారు. అమితాబ్ జీ తెలుగు మూవీ క‌ల్కిలో న‌టించి సినిమా విలువ‌ను అమాంతం పెంచార‌ని వ్యాఖ్యానించారు. భ‌విష్య‌త్ లో ఇలాంటి సినిమాలు మ‌రిన్ని రావాల‌ని కూడా అన్నారు.

జ్ఞాన‌వేల్ నిర్మించిన కంగువ‌ అక్టోబర్ 10న 2D/3Dలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సూర్య‌, జగపతి బాబు, నట్టి నటరాజ్, బాబీ డియోల్, దిశా పటాని త‌దిత‌రులు న‌టించారు. ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రం 2డి - 3డిలో 10 విభిన్న భాషలలో విడుదల కానుంద‌ని నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రం సీక్వెల్ షూటింగ్ 2025 చివరి నాటికి ప్రారంభమవుతుందని, 2027 ప్రథమార్థంలో లేదా జనవరిలో లేదా వేసవి సెలవుల్లో కంగువ పార్ట్ 2 విడుద‌ల‌వుతుంద‌ని నిర్మాత‌ చెప్పారు. కంగువ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన VFX - గ్రాఫిక్స్ ఆగష్టు చివరినాటికి పూర్త‌వుతాయి. త్వరలో ఈ చిత్రం ట్రైలర్ ను విడుద‌ల చేస్తాం. సూర్య పుట్టినరోజు అంటే జూలై 23 న మేకర్స్ ఈ చిత్రం నుండి మొదటి సింగిల్‌ను విడుదల చేస్తారని కూడా ప్ర‌చార‌మ‌వుతోంది.