Begin typing your search above and press return to search.

విజయ్ GOAT .... ఖండించిన నిర్మాత‌

ద‌ళ‌ప‌తి విజయ్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` (ది గోట్) రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోందంటూ పుకార్ షికార్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   29 July 2024 5:30 AM GMT
విజయ్ GOAT .... ఖండించిన నిర్మాత‌
X

ద‌ళ‌ప‌తి విజయ్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` (ది గోట్) రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోందంటూ పుకార్ షికార్ చేస్తోంది. అయితే నిర్మాత అర్చన కల్పాతి ఈ ప్ర‌చారాన్ని ఖండించారు. అసంపూర్తిగా ఉన్న VFX పని కారణంగా GOAT ఆలస్యం అవుతుందని ఊహాగానాలు చెల‌రేగ‌గా.. దీనిపై వెంట‌నే నిర్మాత స్పందించారు. అర్చన కల్పాతి సోషల్ మీడియాల్లో దీనిపై స్ప‌ష్ఠ‌త‌నిచ్చారు. ఈ చిత్రం 5 సెప్టెంబర్ 2024న ముందే ప్ర‌క‌టించిన తేదీన‌ విడుదలకు షెడ్యూల్‌లో ఉందని తెలిపారు. అలాగే గోట్ మూడవ సింగిల్‌కి సంబంధించి ఒక కొత్త అప్‌డేట్ 1ఆగస్ట్ 2024న చెబుతామ‌ని తెలిపారు. ఇది విజ‌య్ అభిమానుల్లో ఉత్సాహం పెంచింది.

ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించారు. జయరామ్, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ప్ర‌ధాన తారాగ‌ణం. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై అర్చన కల్పాతి -కల్పాతి S. అఘోరమ్ నిర్మిస్తున్నారు.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ పాన్ ఇండియా కేట‌గిరీలో దేశ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP తెలుగు వెర్షన్‌ను పంపిణీ చేస్తుంది. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం ప్ర‌ధాన అస్సెట్ కానుంది. విజ‌య్ ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే పోస్ట‌ర్ల‌కు మంచి స్పంద‌న ల‌భించింది.

మైత్రి హ‌వా విజ‌య్ `గోట్`కి ప్ల‌స్

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్ర‌స్తుతం వ‌రుస‌ చిత్రాలను నిర్మిస్తోంది. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. మైత్రి ఇటీవలి కాలంలో నైజాంలో సలార్, హను-మాన్ వంటి ఇతర బ్యాన‌ర్ల‌ సినిమాల‌ను విజయవంతంగా పంపిణీ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ ఇక్కడ కూడా బంపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు, వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల భాగస్వామిగా మార‌డం ఉత్సాహం పెంచింది. ఈ క్రేజీ పాన్ ఇండియా ఫిల్మ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ ప్రమోషన్లతో గ్రాండ్ రిలీజ్ ఉంటుందని మైత్రి తెలిపింది.