Begin typing your search above and press return to search.

'గుంటూరు కారం' ఫినిష్ టచ్.. ట్రైలర్ ఎప్పుడంటే?

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 3:09 PM GMT
గుంటూరు కారం ఫినిష్ టచ్.. ట్రైలర్ ఎప్పుడంటే?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ అయిన ధమ్ మసాలా, ఓ మై బేబి వంటి సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలోనే థర్డ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి.

గత కొన్ని నెలలుగా శరవేగంగా సాగుతున్న గుంటూరు కారం షూటింగ్ రేపటితో పూర్తవుతుందట. కాకపోతే కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో మహేష్ శ్రీలీలపై ఓ మాస్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ పూర్తయితే సినిమా దాదాపు పూర్తి అయినట్లే. రేపటితో ఈ సాంగ్ షూట్ కంప్లీట్ అవుతుందట కొన్ని చిన్న చిన్న ఫ్యాచ్ వర్క్ లను కూడా ఈ నెలాఖరులో పూర్తి చెయ్యనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా జనవరి ఫస్ట్ వీక్ లో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఇక నిన్న క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గుంటూరు కారం నుంచి మాస్ సాంగ్ రాబోతుందని అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో మహేశ్ బాబు, శ్రీలీలా మాస్ మూమెంట్ తో పోస్టర్ అదిరిపోయింది. దీంతో సాంగ్ పై అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. డిసెంబర్ 31 లేదా న్యూ ఇయర్ సందర్భంగా ఈ మాస్ నంబర్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.