Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. గురూజీ పెద్ద ప్లానే వేశారుగా!

ఇక సినిమా కోసం రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ఈ నెల 16 నుంచి మొదలు కానుందని తెలిసింది

By:  Tupaki Desk   |   14 Aug 2023 7:11 AM GMT
గుంటూరు కారం.. గురూజీ పెద్ద ప్లానే వేశారుగా!
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్.. ఏ చిన్న మ్యాటర్ తెలిసినా ఒక రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా ఎదుర్కొంటున్న కష్టాల వల్ల.. ఈ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? వెకేషన్ నుంచి మహేశ్ బాబు షూటింగ్ సెట్ లో ఎప్పుడు అడుగుపెడతారు? గురూజీ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు?.. అసలీ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా?.. అన్న ప్రశ్నలు మాత్రం ఫ్యాన్స్ మెదడును తెగ తొలిచేస్తున్నాయి.

అయితే ఫారెన్ టూర్ వెళ్ళిన మహేశ్ బాబు అక్కడే బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకొని భారత్ కు రీసెంట్ గా తిరిగొచ్చారు. ఇక సినిమా కోసం రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ఈ నెల 16 నుంచి మొదలు కానుందని తెలిసింది. మహేశ్ 20వ తేదీని నుంచి సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారట. హైదరాబాద్ లోనే దాదాపు రెండు నెలల పాటు సాగేలా ఓ లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. నవంబర్ వరకు నాన్ స్టాప్ గా చేయబోతున్నారట. ఈ షెడ్యూల్ లో మహేశ్ పై యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పలు కీలక సీన్స్ కూడా చిత్రీకరించనున్నట్లు తెలిసింది.

అలాగే ఈ సారి టాకీ పార్ట్‌లు కూడా పూర్తయ్యే వరకు ఈ షెడ్యూల్ కొనసాగేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందింది. ఇప్పటివరకు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న ఈ సినిమా షూటింగ్.. ఇకపై ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ ప్రక్రియంతా సజావుగా ముగించాలని ప్రొడక్షన్ టీమ్ గట్టిగా నిర్ణయించుకుందని ఇన్ సైడ్ టాక్.

ఇంకా ఈ సినిమా అనుకున్న సమయాని కన్నా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని మహేశ్ అభిమానులు చాలా కాలం నుంచి ఫీల్ అవుతున్నారు. కానీ అలా ఏమీ అవ్వదని, చెప్పిన సమయానికే వచ్చే ఏడాదికి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవలే మేకర్స్ కొత్త పోస్టర్స్ ద్వారా క్లారిటీ కూడా ఇచ్చారు.

ఇకపోతే ఈ సినిమా ‌విషయానికొస్తే.. కంప్లీంట్ గా కుటుంబ ప్రేక్షకులు మెచ్చే మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో మహేశ్ మాస్ గెటప్ లో సరికొత్తగా కనిపించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.